MI Won against DC: కీలక మ్యాచ్లో ముంబైదే విక్టరీ.. ప్లే ఆఫ్స్ నుంచి ఢిల్లీ ఔట్..!

Mumbai Indians won the Match Against Delhi in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ ఓటమి పాలైంది. 59 పరుగుల తేడాతో ఢిల్లీపై ముంబై గెలుపొందడంతో ముంబై ప్లే ఆఫ్స్ చేరింది. కాగా, ఇప్పటికే ప్లే ఆఫ్స్కు గుజరాత్, పంజాబ్, బెంగళూరు జట్లు చేరుకున్నాయి.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(73) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ రికెల్టన్(25), విల్ జాక్స్(21), , తిలక్ వర్మ(27), నమన్ ధీర్(24) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా.. చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
181 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 121 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్(11), డుప్లెసిస్(6), అభిషేక్ పోరెల్(6) విఫలమయ్యారు. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. రిజ్వీ(39), నిగమ్(20) నిలకడగా ఆడేందుకు ప్రయత్నించారు. కానీ శాంట్నర్ బౌలింగ్లో ఇద్దరు పెవిలియన్ చేేరారు. స్టబ్స్(2), శర్మ(18), మాధవ్ తివారీ(3), చమీరా(8), కుల్దీప్(7) వరుసగా ఔట్ అయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా, శాంట్నర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్, జాక్స్, శర్మ తలో వికెట్ తీశారు.