ఐపీఎల్.. దీనికి ఎంతో క్రేజ్ ఉంది. ప్రపంచం లో ఏ క్రికెట్ లీగ్ కి లేనంత ఫాలోయింగ్ ఐపీఎల్ కి ఉంది. విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో ఆడటానికి ఉత్సాహం చూపిస్తారు. ఐపీఎల్ అంటే కనకవర్షమే. కాసుల పంట కురుస్తుంది. 2008 నుంచి ఐపీఎల్ సీజన్ బీసీసీఐ కి కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ విషయమై చాలా సందిగ్ధత నెలకొంది. కరోనా నేపధ్యం లో నిర్వహణ కష్టతరం అవుతుంది. మరో వైపు, అభిమానులను నిరాశ పరచడం కూడా ఇబ్బంది కరమే. ఈ క్రమం లో ఐపీఎల్ నిర్వహించే విషయమై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైంది. చివరకు అభిమానులు లేకుండానే ఐపీఎల్ ను నిర్వహించారు. ఎప్పుడు లేనన్ని ట్విస్ట్ లతో, ఈ సారి ఐపీఎల్ ఘనం గా , విజయవంతం గా ముగిసింది.
అయితే, నిర్వహణ రీత్యా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఈ ఏడాది ఐపీఎల్ ను యూఏఈ గడ్డపై నిర్వహించారు. ఐపీఎల్ 2020 ఈ సారి ఆర్ధిక పరం గా సంతృప్తి కరం గా సాగినట్లే తెలుస్తోంది. బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా రూ.4 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ముప్పై ఐదు శాతం వరకు ఖర్చులు తగ్గించుకున్నామని అరుణ్ ధుమాల్ తెలిపారు.
గత సీజన్లతో పోలిస్తే, ఈసారి వీక్షకుల సంఖ్యా గణనీయం గా పెరిగినట్లు తెలిపారు. టెలివిజన్, డిజిటల్ వేదికలపై ఐపీఎల్ మ్యాచ్ లు తిలకించేవారి సంఖ్య 25 శాతం పెరిగిందని అరుణ్ వివరించారు. ఐపీఎల్ జరిగినన్ని రోజులు, ఐపీఎల్ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తో కలిపి మొత్తం ముప్పై వేల కరోనా పరీక్షలను చేసినట్లు వెల్లడించారు. ఈసారి ప్రేక్షకులు లేకపోయినా, వర్చువల్ విధానం ద్వారా టీవీ లో ప్రసారం చేసి ఐపీఎల్ సీజన్ 2020 విజయవంతం చేశామని పేర్కొన్నారు. మరిన్ని క్రీడా వార్తలు చదవండి
ఐపీఎల్.. దీనికి ఎంతో క్రేజ్ ఉంది. ప్రపంచం లో ఏ క్రికెట్ లీగ్ కి లేనంత ఫాలోయింగ్ ఐపీఎల్ కి ఉంది. విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో ఆడటానికి ఉత్సాహం చూపిస్తారు. ఐపీఎల్ అంటే కనకవర్షమే. కాసుల పంట కురుస్తుంది. 2008 నుంచి ఐపీఎల్ సీజన్ బీసీసీఐ కి కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ విషయమై చాలా సందిగ్ధత నెలకొంది. కరోనా నేపధ్యం లో నిర్వహణ కష్టతరం అవుతుంది. మరో వైపు, అభిమానులను నిరాశ పరచడం కూడా ఇబ్బంది కరమే. ఈ క్రమం లో ఐపీఎల్ నిర్వహించే విషయమై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైంది. చివరకు అభిమానులు లేకుండానే ఐపీఎల్ ను నిర్వహించారు. ఎప్పుడు లేనన్ని ట్విస్ట్ లతో, ఈ సారి ఐపీఎల్ ఘనం గా , విజయవంతం గా ముగిసింది.
అయితే, నిర్వహణ రీత్యా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఈ ఏడాది ఐపీఎల్ ను యూఏఈ గడ్డపై నిర్వహించారు. ఐపీఎల్ 2020 ఈ సారి ఆర్ధిక పరం గా సంతృప్తి కరం గా సాగినట్లే తెలుస్తోంది. బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా రూ.4 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ముప్పై ఐదు శాతం వరకు ఖర్చులు తగ్గించుకున్నామని అరుణ్ ధుమాల్ తెలిపారు.
గత సీజన్లతో పోలిస్తే, ఈసారి వీక్షకుల సంఖ్యా గణనీయం గా పెరిగినట్లు తెలిపారు. టెలివిజన్, డిజిటల్ వేదికలపై ఐపీఎల్ మ్యాచ్ లు తిలకించేవారి సంఖ్య 25 శాతం పెరిగిందని అరుణ్ వివరించారు. ఐపీఎల్ జరిగినన్ని రోజులు, ఐపీఎల్ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తో కలిపి మొత్తం ముప్పై వేల కరోనా పరీక్షలను చేసినట్లు వెల్లడించారు. ఈసారి ప్రేక్షకులు లేకపోయినా, వర్చువల్ విధానం ద్వారా టీవీ లో ప్రసారం చేసి ఐపీఎల్ సీజన్ 2020 విజయవంతం చేశామని పేర్కొన్నారు. మరిన్ని క్రీడా వార్తలు చదవండి
Read latest క్రీడా వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021