Published On:

Cricket: ఇండియా- బంగ్లాదేశ్ సిరీస్ రద్దు!

Cricket: ఇండియా- బంగ్లాదేశ్ సిరీస్ రద్దు!

Bangladesh Series: ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. అందులో భాగంగా వన్డే, టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అయితే బంగ్లాదేశ్ తో టీమిండియా సిరీస్ రద్దు అయ్యే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ కు సంబంధించి బీసీసీఐకి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సమాచారం. దీంతో ఈ సిరీస్ ప్రస్తుతం జరిగేలా కనిపించడం లేదు. బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అశాంతి తగ్గే వరకు ఈ సిరీస్ వాయిదా పడే అవకాశం ఉంది.

 

భారత్ తో సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ రెడీగా ఉన్నప్పటికీ టీమిండియాను పంపేందుకు కేంద్రం సుముఖంగా లేదు. బంగ్లాదేశ్ తో సిరీస్ దాదాపుగా రద్దు కావడంతో భారత్ తర్వాత ఆడబోయే సిరీస్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. టీమిండియా తమ తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈనేపథ్యంలోనే టీమిండియా అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అయితే ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ తో సిరీస్ రద్దైతే దాదాపు 2 నెలల వరకు టీమిండియా ఆటగాళ్లు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో జట్టుతో సిరీస్ ఆడే అవకాశం ఉందా? లేక తటస్థ వేదికలపై మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: