ముంబై :ఆసీస్ గడ్డ పై టీం ఇండియా విజయం సాధించడంతో, క్రికెట్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతలోనే బీసీసీఐ వారికి మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. ఫిబ్రవరిలో భారత్ జట్టుకు, ఇంగ్లాండ్ జట్టుకు మధ్య సిరీస్ జరగననున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ సిరీస్ కు ప్రేక్షకులను మైదానం వద్దకు అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే, తాజాగా, నియమం సడలించి తగు జాగ్రత్తలతో యాభై శాతం ప్రేక్షకులను అనుమతించబోతున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. అయితే, కరోనా నేపధ్యంలో ఇంగ్లాండ్ టూర్ ను మూడు స్టేడియాలు మాత్రమే పరిమితం చేసారు .
మొత్తం నాలుగు టెస్ట్ లు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ లను కేవలం చెన్నై, అహ్మదాబాద్, పుణెలలోనే నిర్వహించనున్నారు. వీటిలో కొన్ని క్రికెట్ అసోసియేషన్లు కేవలం పాతికశాతం మంది ప్రేక్షకుల్ని మాత్రమే అనుమతించనున్నాయి. అయితే అసలు అనుమతించకపోవడం కన్నా, కొంతమందిని అనుమతించడంతో ఫాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి
ముంబై :ఆసీస్ గడ్డ పై టీం ఇండియా విజయం సాధించడంతో, క్రికెట్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతలోనే బీసీసీఐ వారికి మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. ఫిబ్రవరిలో భారత్ జట్టుకు, ఇంగ్లాండ్ జట్టుకు మధ్య సిరీస్ జరగననున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ సిరీస్ కు ప్రేక్షకులను మైదానం వద్దకు అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే, తాజాగా, నియమం సడలించి తగు జాగ్రత్తలతో యాభై శాతం ప్రేక్షకులను అనుమతించబోతున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. అయితే, కరోనా నేపధ్యంలో ఇంగ్లాండ్ టూర్ ను మూడు స్టేడియాలు మాత్రమే పరిమితం చేసారు .
మొత్తం నాలుగు టెస్ట్ లు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ లను కేవలం చెన్నై, అహ్మదాబాద్, పుణెలలోనే నిర్వహించనున్నారు. వీటిలో కొన్ని క్రికెట్ అసోసియేషన్లు కేవలం పాతికశాతం మంది ప్రేక్షకుల్ని మాత్రమే అనుమతించనున్నాయి. అయితే అసలు అనుమతించకపోవడం కన్నా, కొంతమందిని అనుమతించడంతో ఫాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి
Read latest క్రీడా వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Feb 2021
25 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021