ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క గ్యాలరీలో హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ యొక్క చిత్రం పై దుమారం రేగింది. ఈ చిత్రపటాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆవిష్కరించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దానిని తొలగించాలని కోరుతూ ఛైర్మన్ కు లేఖ రాశారు.
బ్రిటీష్ వారి దురాగతాలను తట్టుకుని ఇంకా వారి ముందు నమస్కరించని గొప్ప స్వాతంత్ర్య సమరయోధులతో పాటు సావర్కర్ చిత్రాన్ని ఆవిష్కరించడం స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉన్న వారందరికీ అవమానం" అని ఛైర్మన్ రమేష్ యాదవ్కు మంగళవారం రాసిన లేఖలో సింగ్ చెప్పారు. వీర్ సావర్కర్ చిత్రాన్ని తీసి బిజెపి పార్లమెంటరీ కార్యాలయంలో ఉంచాలని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని చైర్మన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సింగ్ తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ విషయం పై వ్యాఖ్యానించమని అడిగినప్పుడు, దేశానికి వివిధ వ్యక్తులు ఎలాంటి సహకారం అందించారు అనే విషయంపై యువతలో చర్చ జరగాలని, స్వాతంత్య్ర సంగ్రామానికి సహకరించిన వారందరినీ గౌరవించాలని అన్నారు.
చిత్రటాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి యోగి సావర్కర్ను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మరియు తత్వవేత్త అని పేర్కొన్నాడు, అతని వ్యక్తిత్వం భారతీయులందరికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సావర్కర్ విషయంలో బీజేపీ కాంగ్రెల మధ్య చాలకాలం నుంచి మాటల యుద్దం జరుగుతోంది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి వీర్ సావర్కర్ చేసిన కృషిని బిజెపి ప్రశంసించి అతన్ని "గొప్ప దేశభక్తుడు" అని పిలుస్తుండగా, మహాత్మా గాంధీ హంతకుడితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. మరిన్ని వార్తలు చదవండి
ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క గ్యాలరీలో హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ యొక్క చిత్రం పై దుమారం రేగింది. ఈ చిత్రపటాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆవిష్కరించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దానిని తొలగించాలని కోరుతూ ఛైర్మన్ కు లేఖ రాశారు.
బ్రిటీష్ వారి దురాగతాలను తట్టుకుని ఇంకా వారి ముందు నమస్కరించని గొప్ప స్వాతంత్ర్య సమరయోధులతో పాటు సావర్కర్ చిత్రాన్ని ఆవిష్కరించడం స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉన్న వారందరికీ అవమానం" అని ఛైర్మన్ రమేష్ యాదవ్కు మంగళవారం రాసిన లేఖలో సింగ్ చెప్పారు. వీర్ సావర్కర్ చిత్రాన్ని తీసి బిజెపి పార్లమెంటరీ కార్యాలయంలో ఉంచాలని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని చైర్మన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సింగ్ తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ విషయం పై వ్యాఖ్యానించమని అడిగినప్పుడు, దేశానికి వివిధ వ్యక్తులు ఎలాంటి సహకారం అందించారు అనే విషయంపై యువతలో చర్చ జరగాలని, స్వాతంత్య్ర సంగ్రామానికి సహకరించిన వారందరినీ గౌరవించాలని అన్నారు.
చిత్రటాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి యోగి సావర్కర్ను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మరియు తత్వవేత్త అని పేర్కొన్నాడు, అతని వ్యక్తిత్వం భారతీయులందరికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సావర్కర్ విషయంలో బీజేపీ కాంగ్రెల మధ్య చాలకాలం నుంచి మాటల యుద్దం జరుగుతోంది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి వీర్ సావర్కర్ చేసిన కృషిని బిజెపి ప్రశంసించి అతన్ని "గొప్ప దేశభక్తుడు" అని పిలుస్తుండగా, మహాత్మా గాంధీ హంతకుడితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. మరిన్ని వార్తలు చదవండి
Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Feb 2021
25 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021