MP Bandi Sanjay Complaint : తెలంగాణ సీఎస్, ముఖ్య కార్యదర్శికి లోక్సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుపై విచారణ జరిపిన ప్రివిలేజ్ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్స్పెక్టర్లకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కాగా కరీంనగర్లో జరిగిన ఘటన వివరాలను సంజయ్ ప్రివిలేజ్ కమిటీకి తెలిపారు.ఈ నేపథ్యంలో తమ ముందు హాజరై సంజయ్ కేసులో వివరణ ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది.
బండి సంజయ్పై కరీంనగర్ పోలీస్ కమిషనర్ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. నిన్న లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చారు. కరీంనగర్లో జరిగిన ఘటన వివరాలను తెలిపారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగగా పోలీసులు తలుపులు పగులగొట్టి అరెస్టు చేశారని.. పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని కమిటీకి వివరించారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టారని చెప్పారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ అధికారులకు నోటీసులు పంపింది.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి
ప్రియాంక గాంధీ యూటర్న్.. నేనే సీఎం అభ్యర్దిని అని చెప్పడం లేదు.
MP Bandi Sanjay Complaint : తెలంగాణ సీఎస్, ముఖ్య కార్యదర్శికి లోక్సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుపై విచారణ జరిపిన ప్రివిలేజ్ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్స్పెక్టర్లకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కాగా కరీంనగర్లో జరిగిన ఘటన వివరాలను సంజయ్ ప్రివిలేజ్ కమిటీకి తెలిపారు.ఈ నేపథ్యంలో తమ ముందు హాజరై సంజయ్ కేసులో వివరణ ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది.
బండి సంజయ్పై కరీంనగర్ పోలీస్ కమిషనర్ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. నిన్న లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చారు. కరీంనగర్లో జరిగిన ఘటన వివరాలను తెలిపారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగగా పోలీసులు తలుపులు పగులగొట్టి అరెస్టు చేశారని.. పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని కమిటీకి వివరించారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టారని చెప్పారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ అధికారులకు నోటీసులు పంపింది.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి
ప్రియాంక గాంధీ యూటర్న్.. నేనే సీఎం అభ్యర్దిని అని చెప్పడం లేదు.
Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022