Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. వర్ష బంగ్లా నుంచి తన లగేజీతో పాటు కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని బయటకు వచ్చేశారు. 17 నిమిషాల పాటు రాష్ర్ట ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించిన ఉద్దవ్ సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. శివసేన ప్రెసిడెంట్ పదవిని ఏ శివసైనికుడికైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. అలాగే ఏ శివసైనికుడైనా, తాను పార్టీని నడిపించే సత్తా లేదని భావిస్తే తాను తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నానని ఉద్దవ్ అన్నారు.
సూరత్లో కూర్చుని ప్రకటనలు ఇవ్వడం ఎందుకని ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి అన్నారు. నేరుగా వచ్చి నువ్వు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడివని చెబితే, తాను రాజీనామా చేసి వెళ్లిపోతాను గదా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా పత్రం సిద్దంగా ఉంచుకున్నానని, మీరు వచ్చి రాజ్భవన్ తీసుకువెళ్లండి అని తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశారు ఉద్దవ్ ఠాక్రే. హిందుత్వం వెంటే శివసేన ఉంటుందనీ, హిందుత్వ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తన వారసుడిగా ఏ శివసైనికుడు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నా, తాను సంతోషిస్తాననని అన్నారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. ఉద్దవ్ మంత్రివర్గం సహచరుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. తన అనుచరగణంతో సూరత్కు మకాం మార్చారు. అటు తర్వాత బీజేపీ పాలిత రాష్ర్టమైన అస్సాంకు తన బలగాలను తరలించుకుపోయారు. షిండే తనకు 46 ఎమ్మెల్యేల మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రెండున్నర సంవత్సరాల శివసేన మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని నిలువునా ముంచేశాడు ఏక్నాథ్ షిండే.
ఇదిలా ఉండగా తాజా రాజకీయ పరిణామాలను భారతీయ జనతాపార్టీ ఆసక్తిగా గమనిస్తోంది. త్వరలోనే షిండే నేతృత్వంలో చీలికవర్గానికి బీజేపీ మద్దతు ఇచ్చి మహారాష్ర్టలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది బీజేపీ థింక్ ట్యాంక్.
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. వర్ష బంగ్లా నుంచి తన లగేజీతో పాటు కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని బయటకు వచ్చేశారు. 17 నిమిషాల పాటు రాష్ర్ట ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించిన ఉద్దవ్ సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. శివసేన ప్రెసిడెంట్ పదవిని ఏ శివసైనికుడికైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. అలాగే ఏ శివసైనికుడైనా, తాను పార్టీని నడిపించే సత్తా లేదని భావిస్తే తాను తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నానని ఉద్దవ్ అన్నారు.
సూరత్లో కూర్చుని ప్రకటనలు ఇవ్వడం ఎందుకని ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి అన్నారు. నేరుగా వచ్చి నువ్వు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడివని చెబితే, తాను రాజీనామా చేసి వెళ్లిపోతాను గదా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా పత్రం సిద్దంగా ఉంచుకున్నానని, మీరు వచ్చి రాజ్భవన్ తీసుకువెళ్లండి అని తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశారు ఉద్దవ్ ఠాక్రే. హిందుత్వం వెంటే శివసేన ఉంటుందనీ, హిందుత్వ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తన వారసుడిగా ఏ శివసైనికుడు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నా, తాను సంతోషిస్తాననని అన్నారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. ఉద్దవ్ మంత్రివర్గం సహచరుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. తన అనుచరగణంతో సూరత్కు మకాం మార్చారు. అటు తర్వాత బీజేపీ పాలిత రాష్ర్టమైన అస్సాంకు తన బలగాలను తరలించుకుపోయారు. షిండే తనకు 46 ఎమ్మెల్యేల మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రెండున్నర సంవత్సరాల శివసేన మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని నిలువునా ముంచేశాడు ఏక్నాథ్ షిండే.
ఇదిలా ఉండగా తాజా రాజకీయ పరిణామాలను భారతీయ జనతాపార్టీ ఆసక్తిగా గమనిస్తోంది. త్వరలోనే షిండే నేతృత్వంలో చీలికవర్గానికి బీజేపీ మద్దతు ఇచ్చి మహారాష్ర్టలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది బీజేపీ థింక్ ట్యాంక్.
Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022