ఆంధ్రప్రదేశ్ :నరసాపురం ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటీకి దిగితే వాలంటీరును పోటీకి పెట్టి ఎంపీ కనుమూరి
రఘురామకృష్ణరాజు ఓడిస్తామంటూ తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కు సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సీఎం జగన్ బొమ్మతో గెలిచి ఆయనకే మతాన్ని అంటగట్టేలా మాట్లాడుతున్న ఎంపీ రఘురామరాజుకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలనిఆయన సవాల్ చేసారు. కరోనా వైరస్కు ముందే నియోజకవర్గాన్ని విడిచి ఢిల్లీ, హైదరాబాద్లో ఉంటున్న ఎంపీని నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలు మరిచిపోయారు. తణుకు నియోజకవర్గంలోనే పీఎం రిలీఫ్ ఫండ్స్ సుమారుగా రూ.8 లక్షలు వరకు వచ్చి ఉన్నా ఆ నిధులను వినియోగించే పరిస్థితిలో ఆయన లేరన్నారు.
అన్ని మతాలకు సమన్యాయం చేసేలా అర్చకులు, ఫాదర్స్, ఇమామ్లకు సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ని ఉద్దేశించి మతం రంగు అంటించేలా మాట్లాడడమే కాకుండా కరోనా సమయంలో వినాయక చవితి మండపాలు పెట్టుకోనివ్వలేదని ఎంపీ ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 18 నెలల పాలనలోనే బెస్ట్ సీఎంగా నిలిచిన వ్యక్తికి మతం రంగు అంటించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేతిలో ఎంపీ కనుమూరి కీలుబొమ్మగా మారారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆరోపించారు.
మరిన్ని వార్తలు చదవండి.