Published On:

Car: అన్నమయ్య జిల్లాలో బావిలో పడ్డ కారు.. ముగ్గురు మృతి

Car: అన్నమయ్య జిల్లాలో బావిలో పడ్డ కారు.. ముగ్గురు మృతి

Tragedy: అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదకర ఘటన జరిగింది. పీలేరు సమీపంలోని కురవపల్లిలో ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ప్రమాదంలో కర్నాటకకు చెందిన ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. మృతులది కోలార్ ప్రాంతంగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్ నిన్న రాత్రి బావిలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతిచెందారు. తూత్తుకుడి జిల్లాలోని మీరాన్ కులం గ్రామం సమీపంలో ఓమ్నీ కారు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. ఓ చిన్నారితో సహా ఐదుగురు చనిపోయారు. ముగ్గురు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కారు కోయంబత్తూరు నుంచి చర్చి కార్యక్రమానికి వెళ్తోంది. సమాచారం అందుకున్న అధికారులు నాలుగు గంటలు శ్రమించి వ్యాన్ ను బావి నుంచి బయటకు తీశారు. ప్రమాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.