ఈ కరోనా మహమ్మారి ప్రభావం తో చాల మంది కి ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కూడా జీతంలో కోత తప్పలేదు. మరో వైపు ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ రెనాల్డ్ ఇండియా (RIPL) మాత్రం ఉద్యోగుల పాలిట వరం గా మారింది. ఈ గడ్డు కాలం లో తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ రెనాల్డ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపుతోపాటు అక్కడి ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా ఇచ్చింది. సంస్థ లో 250 మంది ఉద్యోగులు పని చేస్తుండగా... వారందరికీ పదిహేను శాతం జీతాలు పెంచుతున్నట్లు తెలిపింది. సంస్థ 2019లో కంపెనీ గణనీయమైన అభివృద్ధి సాధించిందని వెల్లడించింది. అయితే జీతాల పెంపు నుంచి తన భాగస్వాములైన నిస్సాన్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియాను మినహాయించినట్లుగా తెలిపింది. తాజాగా.. రాబోయే ఫెస్టివల్ సీజన్లో ఎస్యూవీ అమ్మకాలు గణనీయం గా పెరిగే అవకాశం ఉందని రెనాల్డ్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ కరోనా మహమ్మారి ప్రభావం తో చాల మంది కి ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కూడా జీతంలో కోత తప్పలేదు. మరో వైపు ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ రెనాల్డ్ ఇండియా (RIPL) మాత్రం ఉద్యోగుల పాలిట వరం గా మారింది. ఈ గడ్డు కాలం లో తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ రెనాల్డ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపుతోపాటు అక్కడి ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా ఇచ్చింది. సంస్థ లో 250 మంది ఉద్యోగులు పని చేస్తుండగా... వారందరికీ పదిహేను శాతం జీతాలు పెంచుతున్నట్లు తెలిపింది. సంస్థ 2019లో కంపెనీ గణనీయమైన అభివృద్ధి సాధించిందని వెల్లడించింది. అయితే జీతాల పెంపు నుంచి తన భాగస్వాములైన నిస్సాన్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియాను మినహాయించినట్లుగా తెలిపింది. తాజాగా.. రాబోయే ఫెస్టివల్ సీజన్లో ఎస్యూవీ అమ్మకాలు గణనీయం గా పెరిగే అవకాశం ఉందని రెనాల్డ్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది.
Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
28 Jan 2021
28 Jan 2021