అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ విధించిన ఆంక్షలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. కరోనా నిబంధనలను మార్చి 1 వరకు కొనసాగిస్తామంటూ తాజాగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఓ ప్రకటన చేసింది. మార్చి 31 అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, అంతర్జాతీయ విమానాశ్రయాలనుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
అయితే, డీజీసీఏ అనుమతించే ప్రత్యేక విమానాలకు, కార్గో సర్వీసులకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొంది. లాక్ డౌన్ తరువాత పడిపోయిన ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం వరుసగా ఆంక్షలను సడలిస్తూ వచ్చింది. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం ఈ ఆంక్షలను తొలగించలేదు. తాజాగా, వీటిని మరో నెల రోజుల పటు పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. డొమెస్టిక్ విమాన సర్వీసులు గతేడాది చివరలో మొదలైనప్పటికీ, కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.
అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ విధించిన ఆంక్షలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. కరోనా నిబంధనలను మార్చి 1 వరకు కొనసాగిస్తామంటూ తాజాగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఓ ప్రకటన చేసింది. మార్చి 31 అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, అంతర్జాతీయ విమానాశ్రయాలనుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
అయితే, డీజీసీఏ అనుమతించే ప్రత్యేక విమానాలకు, కార్గో సర్వీసులకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొంది. లాక్ డౌన్ తరువాత పడిపోయిన ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం వరుసగా ఆంక్షలను సడలిస్తూ వచ్చింది. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం ఈ ఆంక్షలను తొలగించలేదు. తాజాగా, వీటిని మరో నెల రోజుల పటు పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. డొమెస్టిక్ విమాన సర్వీసులు గతేడాది చివరలో మొదలైనప్పటికీ, కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.
Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
14 Apr 2021
11 Apr 2021
16 Apr 2021
16 Apr 2021
16 Apr 2021