New Delhi: దేశంలో ధరల పెరుగుదలను నియంత్రించే చర్యల్లో భాగంగా భారత్ గోధుమల ఎగుమతులపై తక్షణమే నిషేధం విధించింది. అయితే ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకు ఇతర దేశాలకు భారత ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతి ఆధారంగా మరియు వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా గోధుమ ఎగుమతులు అనుమతించబడతాయని డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ జారీ చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఫిబ్రవరి చివరలో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి నుండి నల్ల సముద్రం ప్రాంతం నుండి ఎగుమతులు పడిపోయిన తరువాత సరఫరాల కోసం ప్రపంచ కొనుగోలుదారులు భారతదేశం పై వత్తిడి చేస్తున్నారు. చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు మార్చిలో వేడి గాలుల కారణంగా భారీ పంట నష్టం జరిగిన తర్వాత గోధుమ ఎగుమతులను నిషేధించే చర్య వచ్చింది. ఏప్రిల్లో 7.79 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కూడా ప్రభుత్వం ఒత్తిడిలో ఉంది.
వరుసగా ఐదు సంవత్సరాల రికార్డు ఉత్పత్తి తర్వాత, వేడి గాలులు పంట దిగుబడిని దెబ్బ తీసాయి. దీనితో భారతదేశం దాని గోధుమ ఉత్పత్తి అంచనాను ఫిబ్రవరి 111.3 టన్నుల నుండి 105 మిలియన్ టన్నులకు తగ్గించింది. మరోవైపు ప్రత్యేక నోటిఫికేషన్లో, ఉల్లి విత్తనాల ఎగుమతి నిబంధనలను సడలిస్తున్నట్లు డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రకటించింది.
New Delhi: దేశంలో ధరల పెరుగుదలను నియంత్రించే చర్యల్లో భాగంగా భారత్ గోధుమల ఎగుమతులపై తక్షణమే నిషేధం విధించింది. అయితే ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకు ఇతర దేశాలకు భారత ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతి ఆధారంగా మరియు వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా గోధుమ ఎగుమతులు అనుమతించబడతాయని డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ జారీ చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఫిబ్రవరి చివరలో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి నుండి నల్ల సముద్రం ప్రాంతం నుండి ఎగుమతులు పడిపోయిన తరువాత సరఫరాల కోసం ప్రపంచ కొనుగోలుదారులు భారతదేశం పై వత్తిడి చేస్తున్నారు. చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు మార్చిలో వేడి గాలుల కారణంగా భారీ పంట నష్టం జరిగిన తర్వాత గోధుమ ఎగుమతులను నిషేధించే చర్య వచ్చింది. ఏప్రిల్లో 7.79 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కూడా ప్రభుత్వం ఒత్తిడిలో ఉంది.
వరుసగా ఐదు సంవత్సరాల రికార్డు ఉత్పత్తి తర్వాత, వేడి గాలులు పంట దిగుబడిని దెబ్బ తీసాయి. దీనితో భారతదేశం దాని గోధుమ ఉత్పత్తి అంచనాను ఫిబ్రవరి 111.3 టన్నుల నుండి 105 మిలియన్ టన్నులకు తగ్గించింది. మరోవైపు ప్రత్యేక నోటిఫికేషన్లో, ఉల్లి విత్తనాల ఎగుమతి నిబంధనలను సడలిస్తున్నట్లు డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రకటించింది.
Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022