Prime9

Uttar Pradesh Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

5 Killed in Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే పై నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును వెనుక నుంచి వచ్చిన అంబులెన్స్ ఢీకొనడంతో ఐదుగురు చనిపోయారు. హర్యానా నుంచి బీహార్ కు అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. కాగా ఘటనలో అంబులెన్స్ లోని ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

 

మృతులను బీహార్ లోని సమస్తిపూర్ జిల్లా వాసులు రాజ్ కుమార్ శర్మ, రవి శర్మ, ఫూలో శర్మ, డ్రైవర్లు సర్ఫరాజ్, అబిద్ హర్యానా వాసులుగా గుర్తించారు. సమస్తిపూర్ కు చెందిన అశోక్ శర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హర్యానా నుంచి బీహార్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద వివరాలను ఆరా తీస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar