Published On:

Covid-19 Cases in India: డేంజర్ బెల్స్.. పెరుగుతున్న క‌రోనా కేసులు

Covid-19 Cases in India: డేంజర్ బెల్స్.. పెరుగుతున్న క‌రోనా కేసులు

Covid-19 Cases Increasing in India: భారత్‌లో కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొన్నటి వరకు విదేశాలకు పరిమితమైన ఈ కేసులు.. భారత్‌లో పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది. తొలుత సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో వైద్యులు పరీక్షించగా.. ఎల్ఎఫ్ 7, ఎన్‌బీ.1.8 వేరియంట్లు కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తేలింది.

 

అయితే, ఈ వేరియంట్లు జేఎన్.1 నుంచి వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ జేఎన్.1 అనేది 2023 ఆగస్టులో తొలిసారిగా గుర్తించారు. కాగా, ఇది ఒమిక్రాన్ బీఏ.2.86 నుంచి వచ్చినట్లు వెల్లడించారు. ఈ వేరియంట్ వ్యాప్తి విపరీతంగా ఉందని, ఈ వేరియంట్ సోకిన వారిలో పొడి దగ్గుతో పాటు రుచి కోల్పోతారు.

 

ఇదిలా ఉండగా, భారత్‌లో ఇప్పటివరకు 257 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కేసులు అదుపులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.