న్యూఢిల్లీ :నేడు కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి దివంగత అరుణ్జైట్లీ ప్రధమ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అరుణ్ జైట్లీ కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోడీ ట్విట్టర్ మాధ్యమం ద్వారా స్పందించారు. 'గతేడాది ఇదే రోజున నా స్నేహితుడిని కోల్పోయాను' అంటూ మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆయనకు మేధా సంపత్తి, ఉన్నత వ్యక్తిత్వ వికాసం కలవు అని, అవి మనం ఎన్నటికీ మరువలేమని మోడీ అరుణ్ జైట్లీ ని గుర్తు చేసుకున్నారు. అరుణ్ జైట్లీ స్మృత్యర్థం నిర్వహించిన సభలో మాట్లాడిన విషయాలను కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను కూడా మోడీ ట్విట్టర్ లో పంచుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ నేత పూనమ్ మహాజన్ లు కూడా అరుణ్ జైట్లీను స్మరించుకుని ఘన నివాళులు అర్పించుకున్నారు. అరుణ్ జైట్లీ గత ఏడాది ఆగస్టు 24న ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యం తో కన్నుమూసిన సంగతి విదితమే.
న్యూఢిల్లీ :నేడు కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి దివంగత అరుణ్జైట్లీ ప్రధమ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అరుణ్ జైట్లీ కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోడీ ట్విట్టర్ మాధ్యమం ద్వారా స్పందించారు. 'గతేడాది ఇదే రోజున నా స్నేహితుడిని కోల్పోయాను' అంటూ మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆయనకు మేధా సంపత్తి, ఉన్నత వ్యక్తిత్వ వికాసం కలవు అని, అవి మనం ఎన్నటికీ మరువలేమని మోడీ అరుణ్ జైట్లీ ని గుర్తు చేసుకున్నారు. అరుణ్ జైట్లీ స్మృత్యర్థం నిర్వహించిన సభలో మాట్లాడిన విషయాలను కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను కూడా మోడీ ట్విట్టర్ లో పంచుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ నేత పూనమ్ మహాజన్ లు కూడా అరుణ్ జైట్లీను స్మరించుకుని ఘన నివాళులు అర్పించుకున్నారు. అరుణ్ జైట్లీ గత ఏడాది ఆగస్టు 24న ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యం తో కన్నుమూసిన సంగతి విదితమే.
Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021