పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదేళ్ల పాలనలో మమత రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేసారు. గణాంకాలు చెప్పేటప్పుడు పొరపాటున బాంబులు, హత్యలు, అల్లర్ల సంఖ్యను, చనిపోయిన బీజేపీ కార్యకర్తల సంఖ్యను చెప్పకుండా చూసుకోండంటూ షా సెటైర్ వేశారు. 2014 నుంచి పశ్చిమ బెంగాల్లో వందకు పైగా బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంటే పశ్చిమబెంగాల్లో మాత్రం రాజకీయ హింస కొనసాగుతోందని షా ఆరోపించారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మమత సారధ్యంలోని తృణమూల్ను ఓడించి బీజేపీకి పట్టం కడతారని ఆయన చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అమలు చేస్తున్నారని, బెంగాల్లో ఎందుకు అమలు చేయడం లేదని, పేదలకు ఉచిత వైద్యం ఎందుకు అందనీయడం లేదని షా ప్రశ్నించారు. మమత కేంద్ర పథకాలను పశ్చిమబెంగాల్లో అమలు చేయనీయడం లేదని ఆరోపించిన ఆయన పేదలపై, పేదల పథకాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని షా సూచించారు. కరోనా వేళ వలస కార్మికులను తరలించేందుకు శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేస్తే కరోనా ఎక్స్ప్రెస్లంటూ మమత ఎగతాలి చేశారని, త్వరలో జరిగే ఎన్నికల్లో తృణమూల్ పార్టీని అదే రైళ్లలో కార్మికులు బయటకు తరలిస్తారని షా చెప్పారు. సీఏఏను వ్యతిరేకించి మమత పెద్ద తప్పు చేశారని, దాని ఫలితం ఆమె చవిచూడబోతున్నారని ఆయన చెప్పారు. బెంగాల్ శరణార్ధులకు భారత పౌరసత్వం ఇస్తే మమత ఎందుకు వ్యతిరేకించారని షా ప్రశ్నించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జన్ సంవాద్ ర్యాలీ పేరుతో ఢిల్లీ బీజేపీ కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదేళ్ల పాలనలో మమత రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేసారు. గణాంకాలు చెప్పేటప్పుడు పొరపాటున బాంబులు, హత్యలు, అల్లర్ల సంఖ్యను, చనిపోయిన బీజేపీ కార్యకర్తల సంఖ్యను చెప్పకుండా చూసుకోండంటూ షా సెటైర్ వేశారు. 2014 నుంచి పశ్చిమ బెంగాల్లో వందకు పైగా బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంటే పశ్చిమబెంగాల్లో మాత్రం రాజకీయ హింస కొనసాగుతోందని షా ఆరోపించారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మమత సారధ్యంలోని తృణమూల్ను ఓడించి బీజేపీకి పట్టం కడతారని ఆయన చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అమలు చేస్తున్నారని, బెంగాల్లో ఎందుకు అమలు చేయడం లేదని, పేదలకు ఉచిత వైద్యం ఎందుకు అందనీయడం లేదని షా ప్రశ్నించారు. మమత కేంద్ర పథకాలను పశ్చిమబెంగాల్లో అమలు చేయనీయడం లేదని ఆరోపించిన ఆయన పేదలపై, పేదల పథకాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని షా సూచించారు. కరోనా వేళ వలస కార్మికులను తరలించేందుకు శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేస్తే కరోనా ఎక్స్ప్రెస్లంటూ మమత ఎగతాలి చేశారని, త్వరలో జరిగే ఎన్నికల్లో తృణమూల్ పార్టీని అదే రైళ్లలో కార్మికులు బయటకు తరలిస్తారని షా చెప్పారు. సీఏఏను వ్యతిరేకించి మమత పెద్ద తప్పు చేశారని, దాని ఫలితం ఆమె చవిచూడబోతున్నారని ఆయన చెప్పారు. బెంగాల్ శరణార్ధులకు భారత పౌరసత్వం ఇస్తే మమత ఎందుకు వ్యతిరేకించారని షా ప్రశ్నించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జన్ సంవాద్ ర్యాలీ పేరుతో ఢిల్లీ బీజేపీ కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు.
Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
16 Jan 2021
15 Jan 2021
17 Jan 2021
16 Jan 2021