Hyderabad: తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వానలు కురిసే అవకాశం ఉండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద, పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయే అవకాశం ఉందని, కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 82 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో 2.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెద్దబెల్లాల్ లో వడదెబ్బకు గురై ఓ ఉపాధి కూలీ ప్రాణాలు కోల్పోయింది.
మరోవైపు, అసని తుపాను కారణంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాలపై మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండు మూడు రోజుల క్రితంతో పోలిస్తే హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు పైగా తగ్గాయి.
Hyderabad: తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వానలు కురిసే అవకాశం ఉండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద, పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయే అవకాశం ఉందని, కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 82 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో 2.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెద్దబెల్లాల్ లో వడదెబ్బకు గురై ఓ ఉపాధి కూలీ ప్రాణాలు కోల్పోయింది.
మరోవైపు, అసని తుపాను కారణంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాలపై మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండు మూడు రోజుల క్రితంతో పోలిస్తే హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు పైగా తగ్గాయి.
Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022