బ్రిస్బేన్ :భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్లో టీమిండియా గబ్బాలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఆస్ట్రేలియానిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్ ఛేదించింది. రిషభ్ పంత్ దూకుడుకు పుజారా డిఫెన్స్ తోడవడంతో ఆసీస్ గడ్డపై విజయాన్ని సాధించింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, బుమ్రా, అశ్విన్ లాంటి కీలక ఆటగాళ్ల లేకుండానే పటిష్టమైన ఆసీస్ టీంపై విజయాన్ని సాధించడం విశేషం.
నాలుగు పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్కు రోహిత్ శర్మ 7 పరుగులకు ఔట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్ శుభమన్ గిల్తో ఇన్సింగ్స్కు బలమైన పునాదులు వేశారు. గిల్ 91 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. పుజారా బాధ్యతగా ఆడి 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రహానే 24 పరుగులతో అవుట్ అయినా రిషభ్ పంత్ సూపర్భ్ ఇన్నింగ్స్తో భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. పంత్ 134 బంతుల్లో 89 పరుగులు చేసిన కీలక సమయంలో వెనుదిరిగాడు. చివరిలో వాషింగ్టన్ సుందర్ 25 పరుగులతో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించి సిరీస్ను కైవసం చేసుకుంది. మరిన్ని వార్తలు చదవండి
బ్రిస్బేన్ :భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్లో టీమిండియా గబ్బాలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఆస్ట్రేలియానిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్ ఛేదించింది. రిషభ్ పంత్ దూకుడుకు పుజారా డిఫెన్స్ తోడవడంతో ఆసీస్ గడ్డపై విజయాన్ని సాధించింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, బుమ్రా, అశ్విన్ లాంటి కీలక ఆటగాళ్ల లేకుండానే పటిష్టమైన ఆసీస్ టీంపై విజయాన్ని సాధించడం విశేషం.
నాలుగు పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్కు రోహిత్ శర్మ 7 పరుగులకు ఔట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్ శుభమన్ గిల్తో ఇన్సింగ్స్కు బలమైన పునాదులు వేశారు. గిల్ 91 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. పుజారా బాధ్యతగా ఆడి 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రహానే 24 పరుగులతో అవుట్ అయినా రిషభ్ పంత్ సూపర్భ్ ఇన్నింగ్స్తో భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. పంత్ 134 బంతుల్లో 89 పరుగులు చేసిన కీలక సమయంలో వెనుదిరిగాడు. చివరిలో వాషింగ్టన్ సుందర్ 25 పరుగులతో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించి సిరీస్ను కైవసం చేసుకుంది. మరిన్ని వార్తలు చదవండి
Read latest క్రీడా వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Feb 2021
25 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021