భారత్ లో కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. భారత్ లో పంపిణి చేయబడుతున్న కోవిడ్ టీకాలు రెండూ చాలా సురక్షితమైనవని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో 7 నెలల్లో అతి తక్కువ రోజువారీ కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 10,064 కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 137 మరణాలు కూడా 1,52,556 కు చేరుకోగా, ఇప్పటివరకు 1,02,28,753 మంది కోలుకున్నారు మరియు ప్రస్తుతం 2,00,528 యాక్టీవ్ కేసులు వున్నాయి.
కాగా, వ్యాక్సినేషన్ లో భాగంగా భారత్ లో ప్రపంచంలో కెల్లా అత్యంత ఎక్కువ సంఖ్యలో కోవిడ్ టీకాలు వేసినట్లు భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనావైరస్ టీకా డ్రైవ్ యొక్క అధికారిక గణాంకాలు 2,07,229 గా నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు. అంటే ఒక్కరోజులోనే 2,07,229 మంది భారతీయులకు కరోనా టీకాను వేశారు. ఈ కోవిడ్ టీకాలు రెండు సురక్షితమైనవేనని, కోవిడ్ - 19 ను నిరోధిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు. టీకాలు కరోనాను వృద్ధి చేయవని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, భారతదేశం అంతటా 4వ రోజు సాయంత్రం 6 గంటల వరకు 1.7 లక్షల మంది లబ్ధిదారులకు కరోనావైరస్ వ్యాక్సిన్లను అందించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకాలు వేసిన వారి సంఖ్య ఇప్పుడు 6.31 లక్షలను దాటింది. "కోవిడ్ -19 కు టీకాలు వేసిన ఆరోగ్య కార్మికుల సంఖ్య 11,660 సెషన్ల ద్వారా 6,31,417 (ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు) కు చేరుకుంది, తాత్కాలిక నివేదిక ప్రకారం. 3,800 సెషన్లు ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు జరిగాయి" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇమ్మ్యూనైజషన్ జరిగాక, మొత్తం తొమ్మిది ప్రతికూల సంఘటనలు జరిగాయని, వీరిని ఆసుపత్రిలోనే ఉంచారని పేర్కొంది. మరిన్ని వార్తలు చదవండి
భారత్ లో కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. భారత్ లో పంపిణి చేయబడుతున్న కోవిడ్ టీకాలు రెండూ చాలా సురక్షితమైనవని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో 7 నెలల్లో అతి తక్కువ రోజువారీ కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 10,064 కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 137 మరణాలు కూడా 1,52,556 కు చేరుకోగా, ఇప్పటివరకు 1,02,28,753 మంది కోలుకున్నారు మరియు ప్రస్తుతం 2,00,528 యాక్టీవ్ కేసులు వున్నాయి.
కాగా, వ్యాక్సినేషన్ లో భాగంగా భారత్ లో ప్రపంచంలో కెల్లా అత్యంత ఎక్కువ సంఖ్యలో కోవిడ్ టీకాలు వేసినట్లు భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనావైరస్ టీకా డ్రైవ్ యొక్క అధికారిక గణాంకాలు 2,07,229 గా నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు. అంటే ఒక్కరోజులోనే 2,07,229 మంది భారతీయులకు కరోనా టీకాను వేశారు. ఈ కోవిడ్ టీకాలు రెండు సురక్షితమైనవేనని, కోవిడ్ - 19 ను నిరోధిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు. టీకాలు కరోనాను వృద్ధి చేయవని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, భారతదేశం అంతటా 4వ రోజు సాయంత్రం 6 గంటల వరకు 1.7 లక్షల మంది లబ్ధిదారులకు కరోనావైరస్ వ్యాక్సిన్లను అందించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకాలు వేసిన వారి సంఖ్య ఇప్పుడు 6.31 లక్షలను దాటింది. "కోవిడ్ -19 కు టీకాలు వేసిన ఆరోగ్య కార్మికుల సంఖ్య 11,660 సెషన్ల ద్వారా 6,31,417 (ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు) కు చేరుకుంది, తాత్కాలిక నివేదిక ప్రకారం. 3,800 సెషన్లు ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు జరిగాయి" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇమ్మ్యూనైజషన్ జరిగాక, మొత్తం తొమ్మిది ప్రతికూల సంఘటనలు జరిగాయని, వీరిని ఆసుపత్రిలోనే ఉంచారని పేర్కొంది. మరిన్ని వార్తలు చదవండి
Read latest ఆరోగ్య వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Feb 2021
25 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021