Andhrapradesh: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నంకు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ మే 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అక్కడి నుంచి దిశ మార్చుకుని ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని వివరించింది.
గంటకు 19 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను, ఒడిశా పూరీకి వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య తీరాన్ని తాకే అవకాశముందని తెలిపారు. ఏపీ, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై తుపాన్ ప్రభావం ఉంటుందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి గోదావరి, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అసని ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి గంటకు 105 నుంచి 125 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. 10వ తేదీ సాయంత్రం నుంచి ఒడిశా తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల మీదుగా అసని సాగనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసింది. ఈదురు గాలుల బీభత్సం కొనసాగింది. దీంతో, చాలా చోట్ల పంటనష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షం దెబ్బతీయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నంకు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ మే 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అక్కడి నుంచి దిశ మార్చుకుని ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని వివరించింది.
గంటకు 19 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను, ఒడిశా పూరీకి వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య తీరాన్ని తాకే అవకాశముందని తెలిపారు. ఏపీ, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై తుపాన్ ప్రభావం ఉంటుందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి గోదావరి, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అసని ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి గంటకు 105 నుంచి 125 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. 10వ తేదీ సాయంత్రం నుంచి ఒడిశా తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల మీదుగా అసని సాగనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసింది. ఈదురు గాలుల బీభత్సం కొనసాగింది. దీంతో, చాలా చోట్ల పంటనష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షం దెబ్బతీయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022