కొత్త ఏడాదిలో జనవరి 6న, మహారాష్ట్ర నుండి గుజరాత్ కు గూడ్స్ రైలు ఒకటి బయలు దేరింది. దీనిలో విశేషమేమిటని అనుకుంటున్నారా? వుంది. ఇందులోని సిబ్బంది అంతా మహిళలే కావడం గమనార్హం. వాసై రోడ్ నుంచి గుజరాత్ వరకు ప్రయాణించిన ఈ ట్రయిన్ భారత రైల్వే చరిత్రలో మహిళలు ప్రయాణించిన భారతదేశంలో మొట్టమొదటి గూడ్స్ ట్రయిన్ గా రికార్డుల్లో కెక్కింది.
గూడ్స్ రైలును నడిపిన ముగ్గురు మహిళలు లోకో పైలట్ కుంకుమ్ సూరజ్ డోంగ్రే, అసిస్టెంట్ లోకో పైలట్ ఉడితా వర్మ, గూడ్స్ గార్డ్ ఆకాన్షా రాయ్. వెస్ట్రన్ రైల్వే చరిత్రలో కూడ మొట్టమొదటి సారిగా మహిళా సిబ్బంది రైలును నడపడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెస్ట్రన్ రైల్వే మరో మూస ధోరణిని విచ్ఛిన్నం చేసి మహిళా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచిందని ప్రశంసించారు. లోకో పైలట్లు మరియు గార్డుల పోస్టులలో చేరడానికి చాలా కొద్ది మంది మహిళలు ముందుకు వస్తారని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తాజా సంఘటనతో మహిళలు ముందుకు వచ్చి భారత రైల్వేలో ఇటువంటి సవాలు ఉద్యోగాలు చేపట్టడానికి ప్రేరణగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. 2019-2020 సంవత్సరంలో భారత రైల్వేలో మొత్తం 1280 మంది మహిళా అభ్యర్థులు ఇంజిన్ డ్రైవర్లుగా చేరారు. మరిన్ని వార్తలు చదవండి
కొత్త ఏడాదిలో జనవరి 6న, మహారాష్ట్ర నుండి గుజరాత్ కు గూడ్స్ రైలు ఒకటి బయలు దేరింది. దీనిలో విశేషమేమిటని అనుకుంటున్నారా? వుంది. ఇందులోని సిబ్బంది అంతా మహిళలే కావడం గమనార్హం. వాసై రోడ్ నుంచి గుజరాత్ వరకు ప్రయాణించిన ఈ ట్రయిన్ భారత రైల్వే చరిత్రలో మహిళలు ప్రయాణించిన భారతదేశంలో మొట్టమొదటి గూడ్స్ ట్రయిన్ గా రికార్డుల్లో కెక్కింది.
గూడ్స్ రైలును నడిపిన ముగ్గురు మహిళలు లోకో పైలట్ కుంకుమ్ సూరజ్ డోంగ్రే, అసిస్టెంట్ లోకో పైలట్ ఉడితా వర్మ, గూడ్స్ గార్డ్ ఆకాన్షా రాయ్. వెస్ట్రన్ రైల్వే చరిత్రలో కూడ మొట్టమొదటి సారిగా మహిళా సిబ్బంది రైలును నడపడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెస్ట్రన్ రైల్వే మరో మూస ధోరణిని విచ్ఛిన్నం చేసి మహిళా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచిందని ప్రశంసించారు. లోకో పైలట్లు మరియు గార్డుల పోస్టులలో చేరడానికి చాలా కొద్ది మంది మహిళలు ముందుకు వస్తారని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తాజా సంఘటనతో మహిళలు ముందుకు వచ్చి భారత రైల్వేలో ఇటువంటి సవాలు ఉద్యోగాలు చేపట్టడానికి ప్రేరణగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. 2019-2020 సంవత్సరంలో భారత రైల్వేలో మొత్తం 1280 మంది మహిళా అభ్యర్థులు ఇంజిన్ డ్రైవర్లుగా చేరారు. మరిన్ని వార్తలు చదవండి
Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
19 Jan 2021
19 Jan 2021
19 Jan 2021
20 Jan 2021