Rain Alert Telugu States: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Rain Alert to Telangana and Andhra Pradesh: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ చేసింది. ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది. కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలు వీయనున్నాయి. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ప్రీ నంబర్లు 1070, 112, 18004250101లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని తెలిపింది.
కాగా, రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, జగగామ, హన్మకొంద జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని చెప్పింది. అంతేకాకుండా ఖమ్మం, నాగర్ కర్నూల్, కొత్తడూడెం, సంగారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, గద్వాల, ఆదిలాబాద్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, రాజన్న జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది.