Published On:

KTR : కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసుల జారీ వేళ.. కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR : కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసుల జారీ వేళ.. కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR sensational comments on BJP and Congress : మాజీ సీఎం, బీఆర్‌ఎస్ కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలను గాలికొదిలేసి నోటీస్లులు ఇస్తున్నారని రేవంత్ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారన్నారు. ప్రజాపాలన కమీషన్ల పాలనగా మారిందని ఆరోపించారు. తమకు చట్టాలపై విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇదంతా కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని మండిపడ్డారు.

 

పాలన చేతకాక నాటకాలు..
17 నెలలుగా పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరోదారి కనిపించటం లేదన్నారు. కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరగడం లేదని స్వయంగా చెబుతున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో కమిషన్ల పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఎస్‌‌ఎల్‌బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారని, సహాయక చర్యలు చేపట్టే తెలివి లేకపోయిందని ఫైర్ అయ్యారు. కమిషన్ల అరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సాహసం చేయలేకపోయారని మండిపడ్డారు.

 

నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు..
నల్లగొండలో సుంకిషాల ప్రాజెక్టు కూలిందని, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ తెలంగాణ అభివృద్ధిని బలిగొడుతున్నారని ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వమన్నారు. తులం బంగారం ఏమైంది? రూ.4 వేల పింఛన్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. మీరు ఎంత నోటీసులు ఇచ్చినా దూది పింజల్లా ఎగిరిపోతాయన్నారు. కాంగ్రెస్‌వి అన్ని చిల్లర ప్రయత్నాలు అన్నారు. త్వరలో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని కేటీఆర్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి: