Last Updated:

Asaduddin Owaisi: హిందూ మఠాలపై ఎందుకు సర్వే చేయరు? యోగి సర్కార్ పై ఒవైసీ ఫైర్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోవిలువైన వక్ఫ్ ఆస్తులను భూ మాఫియాలు స్వాధీనం చేసుకున్నారనే ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు సర్వే ప్రారంభించినట్లు యుపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం చెప్పారు.

Asaduddin Owaisi: హిందూ మఠాలపై ఎందుకు సర్వే చేయరు? యోగి సర్కార్ పై ఒవైసీ ఫైర్

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విలువైన వక్ఫ్ ఆస్తులను భూ మాఫియాలు స్వాధీనం చేసుకున్నారనే ఫిర్యాదుల పై చర్య తీసుకునేందుకు సర్వే ప్రారంభించినట్లు యుపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం చెప్పారు. దీనిని వ్యతిరేకించే వారు పేద ముస్లింల సంక్షేమాన్ని వ్యతిరేకించినట్లేనని అన్నారు.

ముస్లిం వక్ఫ్ మరియు హజ్ మంత్రి ధరమ్ పాల్ సింగ్ బుధవారం కూడా ఇవి “దేవుని ఆస్తులు” అని మరియు వాటిని ఆక్రమించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గుర్తింపులేని ప్రైవేట్ మదర్సాల సర్వే పై వివాదం నేపధ్యంలో వక్ఫ్ ఆస్తులను సర్వే చేయడానికి ప్రణాళిక చేయబడింది. ఏళ్ల తరబడి వక్ఫ్‌కు వెళ్లిన ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను వెనక్కి తీసుకోవాలని యూపీ ప్రభుత్వం యోచిస్తోంది. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఒక ఉత్తర్వు జారీ చేసారు మరియు వారి వారి ప్రాంతాలలో అటువంటి ఆస్తుల వివరాలను కోరుతూ జిల్లాల అంతటా కమిషనర్లు మరియు జిల్లా మేజిస్ట్రేట్‌లకు పంపారు. ఈ నివేదికను రూపొందించేందుకు అధికారులకు నెల రోజుల గడువు ఇచ్చారు.

వక్ఫ్ ఆస్తి సర్వే పై ప్రతిపక్షాలు విమర్శలు లేవనెత్తాయి. మజ్లిస్ పార్టీ దీనిని “ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యం” అని పేర్కొంది. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ టార్గెటెడ్ సర్వే చట్టవిరుద్ధం మరియు మేము దానిని ఖండిస్తున్నాము” అని అన్నారు. దీని ఉద్దేశ్యం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం” అని అన్నారు. హిందూ ధర్మాదాయ బోర్డులను సర్వే చేయండి. ముస్లింలను సెలెక్టివ్ టార్గెట్ చేయడం ఎందుకు’అని ఒవైసీ ప్రశ్నించారు. మజ్లిస్ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ అసిమ్ వకార్ మదరసా సర్వేతో పోలిస్తే వక్ఫ్ సర్వే పెద్ద ఎన్నార్సీ అని అన్నారు. ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోంది. పెద్ద హిందూ మఠాలు మరియు ట్రస్టులపై ఎందుకు సర్వే చేయరు? అంటూ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: