Last Updated:

Tarakaratna Health: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి- వైద్యులు

Tarakaratna Health: తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు.. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు హెల్త్‌బులిటెన్‌ విడుదల చేశారు.

Tarakaratna Health: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి- వైద్యులు

Tarakaratna Health: తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు.. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు.

తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు హెల్త్‌బులిటెన్‌ విడుదల చేశారు.

ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా వైద్యులు వెల్లడించారు.

బెంగళూరు హృదయాలయ వైద్యులు.. బులిటెన్ విడుదల చేశారు.

ప్రత్యేక బృందం పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌ వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు.

కొద్ది దూరం నడిచాక ఆయన అకస్మాత్తుగా పడిపోయారు. యువగళం సైనికులు వెంటనే కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అనంతరం పీఈఎస్‌ వైద్యకళాశాలకు తరలించిన చికిత్స  అందించారు. వైద్యుల సూచన మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ప్రత్యేక వైద్యులతో చికిత్స అందిస్తున్నారు.

పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే అలా..

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న మధ్యలో అస్వస్థతకు గురయ్యారు.

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ పాదయాత్ర చేపట్టారు.

కుప్పంలో నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం Yuvagalam పాదయాత్రలో.. తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.

ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే గమనించిన తెదేపా కార్యకర్తలు ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి లేదా బెంగళూరు ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలుస్తుంది.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన జూనియర్ ఎన్టీఆర్.

బాలకృష్ణకు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులు తెలుసుకున్న ఎన్టీఆర్.

కుప్పం నియోజకవర్గంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి యువగళం  యాత్ర ప్రారంభమైంది.

ఈ యాత్రలో నటుడు తారకతర్న కూడా పాల్గొన్నారు. ఈ పాదయాత్ర ప్రారంభమైన కాసేపటికే.. లోకేష్ మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

ప్రార్థనలు నిర్వహించారు. లోకేశ్‌ తో పాటు తారకరత్న కూడా అందులో పాల్గొన్నారు.

మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు.
ఆ సమయంలోనే గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/