Last Updated:

Road Accident In Delhi: ఘోర రోడ్డు ప్రమాదం… నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్

రోడ్డు డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి ఒక్కసారిగా ఓ ట్రక్కు దూసుకెళ్లింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో జరిగింది.

Road Accident In Delhi: ఘోర రోడ్డు ప్రమాదం… నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్

Road Accident In Delhi: రోడ్డు డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి ఒక్కసారిగా ఓ ట్రక్కు దూసుకెళ్లింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో జరిగింది.

ఢిల్లీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు సీమాపురి ప్రాంతంలో డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకువెళ్లింది. దీనితో గాఢనిద్రలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బుధవారం తెల్లవారుజామున 1.51 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కును కనుక్కునేందుకు పోలీసులు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను కరీం(52), చోట్టే ఖాన్లు(25), షా ఆలం(38), రాహుల్ (45)గా పోలీసులు గుర్తించారు. గాయడిన వారిలో 16 ఏల్ల మనీష్, 30 ఏళ్ల ప్రదీప్ ఉన్నారు.

ఈ ప్రమాదంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: Fire Accident: పేపర్ ప్లేట్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం… ముగ్గురు సజీవ దహనం

ఇవి కూడా చదవండి: