Last Updated:

SI Recruitment scam: జమ్మూ-కశ్మీర్ లో సబ్-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్మెంట్ స్కాం.. నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ లో సబ్-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌ లో సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసింది. కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్, సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌ సురేందర్ సింగ్ తో సహా నలుగురిని సిబిఐ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

SI Recruitment scam: జమ్మూ-కశ్మీర్ లో సబ్-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్మెంట్ స్కాం.. నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

Srinagar: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ లో సబ్-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌ లో సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసింది. కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్, సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌ సురేందర్ సింగ్ తో సహా నలుగురిని సిబిఐ అరెస్టు చేసినట్లు అధికారులు  తెలిపారు. ప్రశ్నాపత్రాల పేపర్లు ప్రింట్ అవుతున్న ప్రింటింగ్ ప్రెస్‌లో ప్యాకింగ్ ఇన్‌చార్జ్ ప్రదీప్ కుమార్, బజిందర్ సింగ్‌ లు ఇరువురు సీబీఐ అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. నిందితులందరినీ విచారణ అనంతరం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు వారు తెలిపారు. ప్రశ్నా పత్రాల పేపర్ల కొరకు ఆశావహులు రూ.20-30 లక్షల దాక చెల్లించినట్లు సీబీఐ విచారణలో తేలిందని వారు తెలిపారు.

ఇప్పటికే ఈ కేసులో జమ్మూ-కశ్మీర్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక సిఆర్‌పిఎఫ్ అధికారి, సిఆర్‌పిఎఫ్ మాజీ కానిస్టేబుల్, జె అండ్ కె ప్రభుత్వ ఉపాధ్యాయుడు, బిఎస్‌ఎఫ్ కమాండెంట్, ఎఎస్‌ఐతో సహా 13 మంది నిందితులను సిబిఐ ఇప్పటివరకు అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఓఖ్లాలోని ప్రింటింగ్ ప్రెస్‌లో ప్యాకింగ్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న కుమార్, ప్యాకింగ్ సమయంలో పరీక్ష ప్రశ్నపత్రాన్ని దొంగిలించి, గతంలో అరెస్టయిన యతిన్ యాదవ్‌కు విక్రయించాడు. ప్లాన్ ప్రకారం పరీక్షకు ఒకరోజు ముందు ఏఎస్‌ఐ అశోక్‌కుమార్‌ ఏర్పాటు చేసిన వాహనాల్లో అభ్యర్థులను జమ్మూ నుంచి కర్నాల్‌కు తరలించారు. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కానిస్టేబుల్ సురేందర్ సింగ్ లీకైన ప్రశ్నపత్రాన్ని కొంతమంది అభ్యర్థులకు అందించినట్లు వారు తెలిపారు.

ఈ ఏడాది మార్చిలో జమ్మూ కాశ్మీర్ సర్వీసెస్ నిర్వహించిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ల పోస్టుల కోసం వ్రాత పరీక్షలో అవకతవకల ఆరోపణలపై 33 మంది నిందితులపై ప్రభుత్వ అభ్యర్థనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది జూన్‌ 4న పరీక్ష ఫలితాలు కూడా వెలువడ్డాయి. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నిందితులు బెంగళూరుకు చెందిన జెకెఎస్‌ఎస్‌బి, ప్రైవేట్ కంపెనీ అధికారులు, లబ్ధిదారుల అభ్యర్థులు మరియు ఇతరుల మధ్య కుట్రకు పాల్పడ్డారని మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు వ్రాత పరీక్ష నిర్వహణలో తీవ్ర అవకతవకలకు కారణమయ్యారని సీబీఐ ఆరోపించింది.

ఇది కూడా చదవండి: Jaipur: పనివారి ద్రోహం.. మత్తుమందు పెట్టి ఫుల్ గా దోచేశారు

ఇవి కూడా చదవండి: