Last Updated:

Mukesh Ambani: టీటీడీ ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళమిచ్చిన ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి, స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు.

Mukesh Ambani: టీటీడీ ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళమిచ్చిన ముఖేష్ అంబానీ

Tirupati: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి, స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుని మండపం వద్ద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న తరువాత‌, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు. ముఖేష్ అంబానీ శుక్రవారం టీటీడీ ట్ర‌స్టుకు రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు. ఆయన వెంట ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు రమేష్ బాబు, హరీంద్రనాథ్, ఓఎస్‌డి రిసెప్షన్ ఇన్‌ఛార్జ్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం అంబానీ మీడియాతో మాట్లాడుతూ తిరుమలను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని, అందరినీ ఆశీర్వదించాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి: