Last Updated:

Kohinoor diamond: కోహినూర్ వజ్రం పూరీ జగన్నాథుడిదే.. తిరిగి ఇచ్చేయాలి..

కోహినూర్ వజ్రం జగన్నాథ స్వామిదేనని ఒడిశాకు చెందినసామాజిక, సాంస్కృతిక సంస్థ శ్రీ జగన్నాథ్ సేన పేర్కొంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుండి చారిత్రాత్మకమైన పూరీ ఆలయానికి తిరిగి రావడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని కోరింది.

Kohinoor diamond: కోహినూర్ వజ్రం పూరీ జగన్నాథుడిదే.. తిరిగి ఇచ్చేయాలి..

Odisha: కోహినూర్ వజ్రం జగన్నాథ స్వామిదేనని ఒడిశాకు చెందిన సామాజిక, సాంస్కృతిక సంస్థ శ్రీ జగన్నాథ్ సేన పేర్కొంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుండి చారిత్రాత్మకమైన పూరీ ఆలయానికి తిరిగి రావడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని కోరింది. క్వీన్ ఎలిజబెత్ II మరణం తరువాత, ఈ 105 క్యారెట్ల వజ్రం ఆమె కోడలు కెమిల్లాకు వెళ్తుంది. ఈ నేపధ్యంలో 12వ శతాబ్దపు పుణ్యక్షేత్రానికి కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రక్రియను సులభతరం చేసేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ పూరీకి చెందిన జగన్నాథ్ సేన రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది.

“కోహినూర్ వజ్రం శ్రీ జగన్నాథ్ కు చెందినది. అది ఇప్పుడు ఇంగ్లండ్ రాణి వద్ద ఉంది. దానిని భారతదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతున్నాను. మహారాజా రంజిత్ సింగ్ దానిని తన వీలునామాతో జగన్నాథ దేవునికి విరాళంగా ఇచ్చాడు” అని సేన పేర్కొంది. కన్వీనర్ ప్రియా దర్శన్ పట్నాయక్ ఈ మేరకు మెమోరాండంలో తెలిపారు. పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నాదిర్ షాపై యుద్ధంలో గెలిచిన తర్వాత పూరీ స్వామికి వజ్రాన్ని దానం చేసినట్లు పట్నాయక్ పేర్కొన్నారు.

రంజిత్ సింగ్ 1839లో మరణించాడు మరియు 10 సంవత్సరాల తరువాత, బ్రిటీష్ వారు కోహినూర్‌ను అతని కుమారుడు దులీప్ సింగ్ నుండి తీసుకువెళ్లారు. అయితే అది పూరీలో జగన్నాథ భగవానుడికి ఇవ్వబడిందని వారికి తెలుసని చరిత్రకారుడు మరియు పరిశోధకుడు అనిల్ ధీర్కి చెప్పారు. ఈ విషయంలో రాణికి లేఖ పంపిన తర్వాత, తనకు అక్టోబర్ 19, 2016న బకింగ్‌హామ్ ప్యాలెస్ నుండి యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వానికి నేరుగా అప్పీల్ చేయమని కోరుతూ సమాధానం వచ్చిందని పట్నాయక్ చెప్పారు.

ఆ లేఖ కాపీని రాష్ట్రపతికి పంపిన మెమోరాండంకు జత చేసినట్లు తెలిపారు. ఆరేళ్లుగా ఈ అంశం పై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించగా, ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు వీసా రాలేదని, దీని కారణంగా తాను యూకే ప్రభుత్వంతో ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లలేనని పట్నాయక్ అన్నారు. ఒడిశా అధికార బిజూ జనతాదళ్ (బిజెడి) ఎంపి భూపిందర్ సింగ్ 2016లో రాజ్యసభలో వజ్రాన్ని వెనక్కి తీసుకురావాలనే అంశాన్ని లేవనెత్తారు.

ఇవి కూడా చదవండి: