Last Updated:

Kerala: కేరళలో నరబలి.. ఇద్దరు మహిళల దారుణ హత్య.

కేరళపతనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్ గ్రామంలో మంత్రవిద్యలో భాగంగా ఇద్దరు మహిళలను అపహరించి, శిరచ్ఛేదం చేసి, పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Kerala: కేరళలో నరబలి.. ఇద్దరు మహిళల  దారుణ హత్య.

Kerala: కేరళపతనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్ గ్రామంలో మంత్రవిద్యలో భాగంగా ఇద్దరు మహిళలను అపహరించి, శిరచ్ఛేదం చేసి, పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎలంతూరు నుంచి తన ఇంటికి వస్తున్న భూతవైద్యుడు భగవల్ సింగ్, అతని భార్య లైలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెరుంబవూరుకు చెందిన షఫీ అలియాస్ రషీద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరు మహిళల తల నరికి వారి మృతదేహాలను పతనం తిట్టలోని ఎలంతూర్ లో పాతిపెట్టారని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ సిహెచ్ నాగరాజు తెలిపారు.

ఎర్నాకుళం జిల్లాకు చెందిన రోస్లిన్, పద్మ అనే ఇద్దరు లాటరీ విక్రేతలు జూన్, సెప్టెంబర్‌లో కనిపించకుండా పోయారు. ఈ ఇద్దరు మహిళలను సింగ్ దంపతులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు దీనితో వుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు సంక్షోభం నుండి బయటపడటానికి మహిళలను బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అని నాగరాజు చెప్పారు. మృతదేహాలను ముక్కలుగా నరికి, దంపతుల ఇంటి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో పాతిపెట్టినట్లు ఆయన తెలిపారు.

సెప్టెంబరు 26న పళనియమ్మ అనే మహిళ తన సోదరి పద్మ కనిపించడం లేదంటూ కొచ్చి సిటీ పోలీసు పరిధిలోని కడవంత్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పద్మ తమిళనాడులోని ధర్మపురికి చెందినా, గత కొన్ని నెలలుగా కొచ్చిలో ఉంటోంది. మొబైల్ ఫోన్ రికార్డుల విశ్లేషణతో పోలీసులు షఫీని అదుపులోకి తీసుకుని విచారించగా జంట హత్యలు వెలుగులోకి వచ్చాయి.జూన్ 8న రోస్లిన్ (49) కనిపించకుండా పోయింది. ఎర్నాకులం జిల్లాలోని కాలడిలో లాటరీ విక్రేత, ఆమె తన భాగస్వామితో కలిసి ఉంటోంది. ఉత్తరప్రదేశ్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఆమె కుమార్తె మంజు కేరళకు వచ్చి ఆగస్టు 17న కాలడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, కాలడి పోలీసులు ఎలాంటి ఆధారాలు కనుగొనలేకపోయారు.

ఇద్దరు మహిళల ఆర్థిక ఇబ్బందులను ఉపయోగించుకుని షఫీ వారిని సింగ్‌కు రప్పించాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేక్ ప్రొఫైల్ సృష్టించి సోషల్ మీడియా ద్వారా షఫీ సింగ్‌తో స్నేహం చేశాడు. నరబలి తమకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని షఫీ దంపతులను నమ్మించాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది, అతను మహిళలను సింగ్ ఇంటికి తీసుకువచ్చాడు.మహిళలను వీరి వద్దకు తీసుకురావడానికి షఫీ దంపతుల నుంచి డబ్బులు తీసుకున్నాడా అనే కోణంలోనూ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.ఎలంతూర్‌లో సాంప్రదాయ వైద్యం చేసే సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాడు. అతనువేలాది మంది అనుచరులను కలిగి ఉన్నాడని,చురుకైన సీపీఐ(ఎం) కార్యకర్త అని స్థానికులు తెలిపారు. సింగ్ తన సోషల్ మీడియా పేజీలలో హైకూలను పోస్ట్ చేసేవాడు. హైకూ కవిత్వంపై తరగతులు కూడా నిర్వహించేవాడు.

ఇవి కూడా చదవండి: