Last Updated:

Ind Vs Aus : భారత్ – ఆసీస్ మ్యాచ్‌కు పూర్తి భద్రత.. రాచకొండ సీపీ మహేష్ భగవత్

భారత్ - ఆసీస్ మ్యాచ్‌కు పూర్తి భద్రత కల్పించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు.

Ind Vs Aus : భారత్ – ఆసీస్ మ్యాచ్‌కు పూర్తి భద్రత.. రాచకొండ  సీపీ మహేష్ భగవత్

Mahesh Bhagwat : భారత్ – ఆసీస్ మ్యాచ్‌కు పూర్తి భద్రత కల్పించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. అభిమానులు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని.. మ్యాచ్ రోజున మెట్రో అదనపు సర్వీసులు ఉంటాయని తెలిపారు. ఆర్టీసీ బస్సులు కూడా అదనంగా ఏర్పాటు చేశామన్నారు. 300 సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తామన్నారు.

రేపు జరిగే మ్యాచ్ కి 2500 పోలీస్ సిబ్బందితో సెక్యురిటీ ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ను వీక్షించేందుకు 40 వేలకు పైగా ప్రేక్షకులు వస్తారన్నారు. ప్లేయర్స్ రేపు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. రేపు ఉదయం ప్రాక్టీస్ కి గ్రౌండ్ కు ప్లేయర్స్ వస్తారని వెల్లడించారు. రేపు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో ట్రైన్స్ నడుస్తాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి ఎక్కువ మెట్రో సర్వీసులు నడుస్తాయన్నారు. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారని పేర్కొన్నారు.

300 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేశామన్నారు. గ్రౌండ్ లో ఉండే ప్రతీ వ్యక్తిని జూమ్ చేసి చూసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిని బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్స్ కి అనుసంధానం చేస్తామన్నారు. ప్రేక్షకుల మొబైల్స్, బ్లూటూత్ హెడ్ సెట్ లను అనుమతిస్తామన్నారు. సిగరెట్, కెమెరాలు, షార్ప్ ఆబ్జెక్ట్, ఆల్కహాల్, వాటర్ బాటిల్స్, హెల్మెట్స్, పెట్స్, ఫైర్ క్రాకర్స్, బయటి ఫుడ్, బ్యాగ్స్, సెల్ఫీ స్టిక్స్, డ్రగ్స్ అనుమతించమన్నారు. షార్ప్ షూటర్స్, ఆక్టోపస్ యూనిట్స్, మోంటెడ్ హార్సెస్ టీమ్స్ అందుబాటులో ఉంచాం. రేపు వర్షాలు వచ్చే ఛాన్స్ లేదని వాతావరణ శాఖ తెలిపింది. పిక్ పాకెటర్స్ పై ప్రత్యేక దృష్టి పెడతాం. దొంగలు కూడా టికెట్స్ కొని లోపలికి వచ్చి ఫోన్స్, పర్సులు కొట్టేస్తారు. గ్రౌండ్ లో స్పైడర్ కెమెరా ఉంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్, మెడికల్ టీమ్స్ ఉంటాయి. 7 అంబులెన్స్ లు ప్రేక్షకుల కోసం, 2 అంబులెన్స్ లు ప్లేయర్స్ కోసం ఉంటాయని మహేష్ భగవత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి: