Last Updated:

Kullu Road Accident: లోయలో పడిన టెంపో.. 7 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కులులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న ఓ టెంపో ట్రావెలర్‌ ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దానితో 7 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Kullu Road Accident: లోయలో పడిన టెంపో.. 7 మంది మృతి

Kullu Road Accident: హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కులులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న ఓ టెంపో ట్రావెలర్‌ ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దానితో 7 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

హిమగిరుల అందాల నడుమ ప్రకృతితో అలరారుతున్న హిమాచల్ ప్రదేశ్లోని కులూ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువే. అయితే ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాధించాలని వచ్చిన కొందరు ప్రయాణికుల టెంపో ట్రావెలర్ ఆదివారం రాత్రి ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. దానితో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 10 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కులులోని ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితులంతా హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Boat Accident: ఘోర పడవ ప్రమాదం.. 23 మంది మృతి

ఇవి కూడా చదవండి: