Terror attack in Washington DC: అమెరికాలో ఉగ్రచర్య కలకలం.. ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులు మృతి

Terror Attack Two Israeli Embassy staff shot dead in Washington DC: అమెరికాలో ఉగ్రచర్య కలకలం రేపింది. వాషింగ్టన్లో ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇద్దరిని కాల్చి చంపారు. ఈ ఘటన కేపిటల్ జ్యూవిష్ మ్యూజియం బయట చోటుచేసుకుంది. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయేలీయులు మృతి చెందారు. మృతుల్లో మహిళ కూడా ఉంది. కాల్పుల అనంతరం ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ నినాదాలు చేశారు.
వాషింగ్టన్లోని కేపిటల్ జ్యూవిష్ మ్యూజియం వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయం సిబ్బంది చనిపోయారు. ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. ఈ మేరకు సంతాపం ప్రకటించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమెరికాలో ఈ దాడులకు ముగింపు పలకాలని చెప్పారు. అలాగే జాతి వ్యతిరేకతకు ఇక్కడ తావు లేదని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఈ కాల్పులపై ఇజ్రాయెల్ యూఎన్ రాయబారి డానీ డానన్ ఖండించారు.