మహమ్మారి కరోనా వైరస్ పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి యూసుఫ్ రజా గిలానీకి సైతం సోకింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కాసిమ్ గిలానీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని అయిన తన తండ్రికి కరోనా వైరస్ సోకితే, అందుకు ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోనే కారణమంటూ కాసిమ్ నిందలు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకు ధన్యవాదాలు! మీరు విజయవంతంగా నా తండ్రి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టారు.’’ అని కాసిమ్ గిలానీ ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాని గిలానీ నవాజ్ షరీఫ్ కేసు విషయంపై గత గురువారమే రావల్పిండిలోని ఓ కోర్టులో విచారణకు హాజరయ్యారు. పాక్ రాజకీయ పార్టీ పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్, పీపీపీ కో చైర్ పర్సన్ అసిఫ్ అలీ జర్దారీ ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ విచారణ సందర్భంగా గిలానీ మాట్లాడుతూ.. కోర్టులో వ్యక్తిగత హాజరుకు తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ప్రజా ప్రతినిధులకు సైతం కరోనా వైరస్ సోకుతున్న నేపథ్యంలో ఈ మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు.
మాజీ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీకి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఆయన ఇస్లామాబాద్లోని తన నివాసంలో క్వారంటైన్లోనే ఉంటున్నారు.
కాగా, ప్రస్తుతం పాకిస్థాన్లో 1,32,405 కరోనా కేసులు నమోదయ్యాయి. . కరోనా కారణంగా అక్కడ 2,551 మంది చనిపోయారు.
మహమ్మారి కరోనా వైరస్ పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి యూసుఫ్ రజా గిలానీకి సైతం సోకింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కాసిమ్ గిలానీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని అయిన తన తండ్రికి కరోనా వైరస్ సోకితే, అందుకు ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోనే కారణమంటూ కాసిమ్ నిందలు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకు ధన్యవాదాలు! మీరు విజయవంతంగా నా తండ్రి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టారు.’’ అని కాసిమ్ గిలానీ ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాని గిలానీ నవాజ్ షరీఫ్ కేసు విషయంపై గత గురువారమే రావల్పిండిలోని ఓ కోర్టులో విచారణకు హాజరయ్యారు. పాక్ రాజకీయ పార్టీ పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్, పీపీపీ కో చైర్ పర్సన్ అసిఫ్ అలీ జర్దారీ ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ విచారణ సందర్భంగా గిలానీ మాట్లాడుతూ.. కోర్టులో వ్యక్తిగత హాజరుకు తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ప్రజా ప్రతినిధులకు సైతం కరోనా వైరస్ సోకుతున్న నేపథ్యంలో ఈ మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు.
మాజీ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీకి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఆయన ఇస్లామాబాద్లోని తన నివాసంలో క్వారంటైన్లోనే ఉంటున్నారు.
కాగా, ప్రస్తుతం పాకిస్థాన్లో 1,32,405 కరోనా కేసులు నమోదయ్యాయి. . కరోనా కారణంగా అక్కడ 2,551 మంది చనిపోయారు.
Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
17 Jan 2021
16 Jan 2021
18 Jan 2021
18 Jan 2021
18 Jan 2021
19 Jan 2021