కొత్త కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో ఈ ప్రభావం తక్కువగా కనిపిస్తున్నా బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో మాత్రం ఈ కేసులు వణికిస్తున్నాయి. తాజాగా, ఈ స్ట్రెయిన్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపధ్యంలో అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. అమెరికాకు రావాలనుకునే ప్రయాణికులు విధిగా కరోనా నెగటివ్ ధృవ పత్రాన్ని చూపిస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తొందరలో విడుదల చేయనుంది.
ఉత్తర్వులు జారీ అయినా తరువాత జనవరి 26 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. యూకేలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కరోనా స్ట్రెయిన్ తన ప్రతాపం చూపిస్తుండడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత, విదేశాల నుంచి అమెరికా కు వచ్చే వారే కాకుండా, అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లి తిరిగి వచ్చే పౌరులు కూడా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
కొత్త కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో ఈ ప్రభావం తక్కువగా కనిపిస్తున్నా బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో మాత్రం ఈ కేసులు వణికిస్తున్నాయి. తాజాగా, ఈ స్ట్రెయిన్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపధ్యంలో అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. అమెరికాకు రావాలనుకునే ప్రయాణికులు విధిగా కరోనా నెగటివ్ ధృవ పత్రాన్ని చూపిస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తొందరలో విడుదల చేయనుంది.
ఉత్తర్వులు జారీ అయినా తరువాత జనవరి 26 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. యూకేలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కరోనా స్ట్రెయిన్ తన ప్రతాపం చూపిస్తుండడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత, విదేశాల నుంచి అమెరికా కు వచ్చే వారే కాకుండా, అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లి తిరిగి వచ్చే పౌరులు కూడా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021