న్యూఢిల్లీ :ఎంతగానో ఎదురు చూస్తున్న కరోనా టీకా రానే వచ్చేసింది. ఇక, అన్ని జిల్లాల్లోకి పంపిణి చేయడమే మిగిలి ఉంది. ఈరోజు ఉదయం బయలుదేరిన విమానాలు దాదాపు పన్నెండు నగరాల్లో వాక్సిన్ డోసులను అందించనున్నాయి. వీటిని ఆయా జిల్లాల్లో పంపిణి చేయాల్సి ఉంది. అయితే, వీటికోసం కేంద్రం భారీగానే ఖర్చు పెడుతోందని సమాచారం. తొలి విడతగా అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2021వ సంవత్సరం ఆగస్టు నెలాఖరులోపు ముప్పై కోట్ల మందికి కరోనా టీకా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2022వ సంవత్సరం చివరికి వచ్చేసరికి మరో యాభై కోట్ల మందికి కరోనా టీకా వేయడం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతగా ముప్పై కోట్ల మందికి కరోనా టీకా అందించడానికి 21 వేల కోట్ల నుంచి 27 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. రెండవ విడత కరోనా టీకా పంపిణికి 35 వేల నుంచి 45 వేల కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈ ఖర్చు దేశ జిడిపిలో 0.4 శాతంగా ఉంది. భారత్ లో మొత్తం ఎనభై కోట్ల మందికి టీకా అందించాలంటే, 56 నుంచి 72 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
ఒక్కో డోసు ఖరీదు వంద నుంచి నూట యాభై రూపాయలు ఉండగా, ఒక్కొక్క వ్యక్తికీ కనీసం మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విషయాన్నీ ఇప్పటికే సీరం సంస్థ ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కొక్క వ్యక్తికీ కరోనా టీకా డోసు పూర్తిగా వేయడానికి 700 నుంచి 900 రూపాయల ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే, భారత్ బయెటెక్ తయారుచేసిన కరోనా టీకాకి కూడా అనుమతులు వచ్చాయి. ఈ టీకాను అందించడానికి వంద రూపాయలకంటే తక్కువగానే ఖర్చవుతుందని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి
న్యూఢిల్లీ :ఎంతగానో ఎదురు చూస్తున్న కరోనా టీకా రానే వచ్చేసింది. ఇక, అన్ని జిల్లాల్లోకి పంపిణి చేయడమే మిగిలి ఉంది. ఈరోజు ఉదయం బయలుదేరిన విమానాలు దాదాపు పన్నెండు నగరాల్లో వాక్సిన్ డోసులను అందించనున్నాయి. వీటిని ఆయా జిల్లాల్లో పంపిణి చేయాల్సి ఉంది. అయితే, వీటికోసం కేంద్రం భారీగానే ఖర్చు పెడుతోందని సమాచారం. తొలి విడతగా అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2021వ సంవత్సరం ఆగస్టు నెలాఖరులోపు ముప్పై కోట్ల మందికి కరోనా టీకా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2022వ సంవత్సరం చివరికి వచ్చేసరికి మరో యాభై కోట్ల మందికి కరోనా టీకా వేయడం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతగా ముప్పై కోట్ల మందికి కరోనా టీకా అందించడానికి 21 వేల కోట్ల నుంచి 27 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. రెండవ విడత కరోనా టీకా పంపిణికి 35 వేల నుంచి 45 వేల కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈ ఖర్చు దేశ జిడిపిలో 0.4 శాతంగా ఉంది. భారత్ లో మొత్తం ఎనభై కోట్ల మందికి టీకా అందించాలంటే, 56 నుంచి 72 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
ఒక్కో డోసు ఖరీదు వంద నుంచి నూట యాభై రూపాయలు ఉండగా, ఒక్కొక్క వ్యక్తికీ కనీసం మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విషయాన్నీ ఇప్పటికే సీరం సంస్థ ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కొక్క వ్యక్తికీ కరోనా టీకా డోసు పూర్తిగా వేయడానికి 700 నుంచి 900 రూపాయల ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే, భారత్ బయెటెక్ తయారుచేసిన కరోనా టీకాకి కూడా అనుమతులు వచ్చాయి. ఈ టీకాను అందించడానికి వంద రూపాయలకంటే తక్కువగానే ఖర్చవుతుందని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి
Read latest ఆరోగ్య వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021