హైదరాబాద్ :కరోనా మహమ్మారి వచ్చిన తరువాత ప్రజలతో పాటు వైద్యుల్లో కూడా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. చికిత్స కోసం వచ్చే రోగులకు కరోనా ఉందొ లేదో తెలియకపోవడం. నిర్ధారణ పరీక్షలలో జాప్యం జరుగుతుండడం, వంటి కారణాలతో చికిత్సను ఆలస్యం చేస్తున్నారు. దీనితో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. హైదరాబాద్ లో సిటిజెన్ ఆసుపత్రిలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహారణ.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పిహెచ్ డి చేస్తున్న సూర్య ప్రతాప్ ఈ నెల 17 వ తేదీ అనారోగ్యంతో శేరిలింగంపల్లి సిటిజన్ హాస్పిటల్ లో చేరాడు. అతను ఈరోజు మృతి చెందాడు. అతని మరణానికి సిటిజెన్ హాస్పిటల్ సిబ్బందే కారణం అని విద్యార్ధి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో చేరిన సూర్య ప్రతాప్ కు తొలుత కరోనా నెగటివ్ అని చెప్పారు. మరో రోజు పాజిటివ్ అని చెప్పారు. చికిత్స అందించకుండా కాలయాపన చేసారు.
ఈ పరిస్థితిలో సూర్య ప్రతాప్ ని గచ్చిబౌలి లోని మరో హాస్పిటల్ కి తరలించారు. అక్కడ కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ, సూర్య ప్రతాప్ ఆరోగ్యం క్షీణించింది. ఆలస్యంగా వైద్యం అందించడంతో సూర్య ప్రతాప్ చికిత్స తీసుకుంటూనే మృతి చెందాడు. ఈ నేపధ్యంలో సిటిజెన్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే సూర్య ప్రతాప్ మృతి చెందాడని చందానగర్ పోలీస్ స్టేషన్ లో యూనివర్సిటీ విద్యార్ధి సంఘం నాయకులు ఫిర్యాదు నమోదు చేసారు. మరిన్ని వార్తలు చదవండి.
హైదరాబాద్ :కరోనా మహమ్మారి వచ్చిన తరువాత ప్రజలతో పాటు వైద్యుల్లో కూడా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. చికిత్స కోసం వచ్చే రోగులకు కరోనా ఉందొ లేదో తెలియకపోవడం. నిర్ధారణ పరీక్షలలో జాప్యం జరుగుతుండడం, వంటి కారణాలతో చికిత్సను ఆలస్యం చేస్తున్నారు. దీనితో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. హైదరాబాద్ లో సిటిజెన్ ఆసుపత్రిలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహారణ.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పిహెచ్ డి చేస్తున్న సూర్య ప్రతాప్ ఈ నెల 17 వ తేదీ అనారోగ్యంతో శేరిలింగంపల్లి సిటిజన్ హాస్పిటల్ లో చేరాడు. అతను ఈరోజు మృతి చెందాడు. అతని మరణానికి సిటిజెన్ హాస్పిటల్ సిబ్బందే కారణం అని విద్యార్ధి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో చేరిన సూర్య ప్రతాప్ కు తొలుత కరోనా నెగటివ్ అని చెప్పారు. మరో రోజు పాజిటివ్ అని చెప్పారు. చికిత్స అందించకుండా కాలయాపన చేసారు.
ఈ పరిస్థితిలో సూర్య ప్రతాప్ ని గచ్చిబౌలి లోని మరో హాస్పిటల్ కి తరలించారు. అక్కడ కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ, సూర్య ప్రతాప్ ఆరోగ్యం క్షీణించింది. ఆలస్యంగా వైద్యం అందించడంతో సూర్య ప్రతాప్ చికిత్స తీసుకుంటూనే మృతి చెందాడు. ఈ నేపధ్యంలో సిటిజెన్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే సూర్య ప్రతాప్ మృతి చెందాడని చందానగర్ పోలీస్ స్టేషన్ లో యూనివర్సిటీ విద్యార్ధి సంఘం నాయకులు ఫిర్యాదు నమోదు చేసారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆరోగ్య వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
01 Mar 2021
02 Mar 2021