న్యూఢిల్లీ :కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 69,239 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. తాజాగా 912 మంది
కరోనా వైరస్ బాధితులు ప్రాణాలు విడువడంతో ఆ సంఖ్య 56,706 కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 22,80,567 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 7,07,668 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 4వేల 249కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 755కు పెరిగింది. కాగా కొత్తగా 1851 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, మొత్తం కోలుకున్నారి సంఖ్య 80,586గా నమోదైంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 22,908 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో హోమ్ ఐససోలేషన్లో ఉన్న వారి సంఖ్య 16,387గా ఉంది. ఇక కేసుల విషయానికి వస్తే, జీహెచ్ఎంసీ-472, జగిత్యాల-105, ఖమ్మం-105, కరీంనగర్- 125, నల్గొండ-137, నిజామాబాద్-148, రంగారెడ్డి-131, సూర్యాపేట - 110గా ఉన్నాయి.
మరిన్ని వార్తలు చదవండి.