Poonam Kaur on Trivikram: త్రివిక్రమ్పై పూనమ్ సంచలన పోస్ట్ – మరోసారి ఫిర్యాదు.. మహిళా సంఘాన్ని ఆశ్రయిస్తానంటున్న నటి

Poonam Kaur Again Complaint on Trivikram: నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరమైన.. తనకు జరిగిన అన్యాయంపై ఆమె పోరాటం చేస్తూనే ఉంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై తన పోరాటాన్ని ఆమె కొనసాగిస్తునే ఉంది. కాగా మీ టూ ఉద్యమం టైంలో పూనమ్ కౌర్ త్రివిక్రమ్ చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనంగా మారాయి.
బహిరంగంగా ఆయన బండారం బయటపెట్టడమే కాదు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లోనూ ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి త్రివిక్రమ్ పూనమ్ ఫిర్యాదు చేసింది. ఎప్పటికీ ఆయనను వదిలిపెట్టేది లేదని, ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు పూనమ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్స్ పెట్టింది. అలాగే ఉమెన్ సెఫ్టీ సెల్ సభ్యురాలు యాంకర్ జాన్సీతో చేసిన చాట్ స్క్రిన్ షాట్ని కూడా ఆమె షేర్ చేశారు. ఇందులో ఆమె ఏం చెప్పిందంటే.. “నేను ఇది వరకే చెప్పాను. మళ్లీ చెప్తున్నా.
త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఈ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను. మీటింగ్ పెడదాం అని చెప్పి ఆలస్యం చేవారు. సడన్గా తనను డిస్టర్బ్ చెయ్యొద్దని అన్నారు. నేను ఎవరి పేరు చెప్పలేదు. కానీ, ఇండస్ట్రీలో చాలా మంది వ్యక్తులు అతడిని రక్షిస్తున్నారు. రాజకీయ పరంగానూ ఆయనకు అండదండలు ఉన్నాయి. నేను ఈ మెయిల్ రాసినట్టు మహిళా సంఘంతో మాట్లాడతాను” అని ఆమె రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్స్ని కూడా ఆమె షేర్ చేశారు.
సినిమా అవకాశాల పేరుతో త్రివిక్రమ్ తనని మోసం చేశాడని, ఇండస్ట్రీలో తను ఎదగకుండా చేశారంటూ ఆమె గతంలో ఆయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. ఇప్పటికీ ఈ వివాదంపై అప్పుడప్పుడు పూనమ్ ట్వీట్ చేస్తూనే ఉంటుంది. అప్పట్లోనే ఆయనపై ఆమె మాలో ఫిర్యాదు చేసింది. దీనిపై అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సోషల్ మీడియాలో వేదికగా ప్రశ్నించింది. అంతేకాదు సందర్భం వచ్చినప్పుడల్లా త్రివిక్రమ్లో ఆమె కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఆయనపై డైరెక్టర్గానే విమర్శలు చేస్తూనే ఉంటుంది. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందనేది ఇప్పట్లో తేలే అంశంల కనిపించడం లేదు.