హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులకు వీడియోల ద్వారా పాఠాలను బోధిస్తున్నటిసాట్ సంస్థ తాజాగా ఎయిర్ టెల్ సంస్థతో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్ టెల్ నెట్వర్క్ సంస్థ తెలంగాణ విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను అందించేందుకు అంగీకారం తెలిపింది. ఎయిర్ టెల్ డీటిహెచ్ ఛానల్ నెం.948, 949నెంబర్లలో టి-సాట్ విద్య, నిపుణ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి.
దేశంలోని మొబైల్ రంగంలో మూడవ స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ సంస్థ తెలంగాణ వ్యాప్తంగా డీటీహెచ్ ద్వార 10లక్షలు, ఎక్స్ట్రీమ్ ద్వారా 1.5 కోట్లసబ్ స్క్రైబర్స్ కలిగి ఉండటమే కాకుండా 18 దేశాల్లో విస్తరించి ఉంది. వైర్ లెస్,మొబైల్, ఫిక్స్డ్ లైన్, హై స్పీడ్, డీటీహెచ్ ద్వార సేవలందిస్తూ దేశ వ్యాపితంగా మార్చి-2020 వరకు 423 మిలియన్ కష్టమర్లను కలిగి ఉంది. ఫలితంగా టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు దేశ వ్యాప్తంగా విస్తృతమవనున్నాయి.
తెలంగాణలో పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ చదివే లక్షలాది మంది విద్యార్థులకు ఈ ఒప్పందం వలన నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఆగస్టు 15వ తేదీన 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టి-సాట్, ఎయిర్ టెల్ డీటీహెచ్ మధ్య కుదిరిన ఒప్పందంపై టి- సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, భారతీ ఎయిర్ టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఈవో అవనీత్ పురి గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని వార్తలు చదవండి.
హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులకు వీడియోల ద్వారా పాఠాలను బోధిస్తున్నటిసాట్ సంస్థ తాజాగా ఎయిర్ టెల్ సంస్థతో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్ టెల్ నెట్వర్క్ సంస్థ తెలంగాణ విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను అందించేందుకు అంగీకారం తెలిపింది. ఎయిర్ టెల్ డీటిహెచ్ ఛానల్ నెం.948, 949నెంబర్లలో టి-సాట్ విద్య, నిపుణ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి.
దేశంలోని మొబైల్ రంగంలో మూడవ స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ సంస్థ తెలంగాణ వ్యాప్తంగా డీటీహెచ్ ద్వార 10లక్షలు, ఎక్స్ట్రీమ్ ద్వారా 1.5 కోట్లసబ్ స్క్రైబర్స్ కలిగి ఉండటమే కాకుండా 18 దేశాల్లో విస్తరించి ఉంది. వైర్ లెస్,మొబైల్, ఫిక్స్డ్ లైన్, హై స్పీడ్, డీటీహెచ్ ద్వార సేవలందిస్తూ దేశ వ్యాపితంగా మార్చి-2020 వరకు 423 మిలియన్ కష్టమర్లను కలిగి ఉంది. ఫలితంగా టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు దేశ వ్యాప్తంగా విస్తృతమవనున్నాయి.
తెలంగాణలో పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ చదివే లక్షలాది మంది విద్యార్థులకు ఈ ఒప్పందం వలన నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఆగస్టు 15వ తేదీన 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టి-సాట్, ఎయిర్ టెల్ డీటీహెచ్ మధ్య కుదిరిన ఒప్పందంపై టి- సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, భారతీ ఎయిర్ టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఈవో అవనీత్ పురి గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox