Andhrapradesh: నంద్యాల జిల్లా నందికొట్కూరులో పదవ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ కలకలం రేపుతోంది. గాంధీ మెమోరియల్ హైస్కూల్ పేపర్ లీకైన ఫొటోస్ బయటకు వచ్చాయి. అయితే హైస్కూల్ అటెండర్ ద్వారా పేపర్ బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన పేపర్స్కు జవాబు పత్రం తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నట్లుగా సమాచారం.
మరోవైపు స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పరీక్ష పూర్తి అయినా విద్యార్థులను బయటకు పంపకపోవడం పై మండిపడుతున్నారు. పేపర్ లీక్ కావడంతో విద్యాశాఖ, పోలీసులు స్కూల్లో విచారణ చేపట్టారు. దీంతో విద్యార్థులను బయటకు పంపలేదు. అయితే దీనిపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వచ్చిన తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవాలి తప్పా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: నంద్యాల జిల్లా నందికొట్కూరులో పదవ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ కలకలం రేపుతోంది. గాంధీ మెమోరియల్ హైస్కూల్ పేపర్ లీకైన ఫొటోస్ బయటకు వచ్చాయి. అయితే హైస్కూల్ అటెండర్ ద్వారా పేపర్ బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన పేపర్స్కు జవాబు పత్రం తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నట్లుగా సమాచారం.
మరోవైపు స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పరీక్ష పూర్తి అయినా విద్యార్థులను బయటకు పంపకపోవడం పై మండిపడుతున్నారు. పేపర్ లీక్ కావడంతో విద్యాశాఖ, పోలీసులు స్కూల్లో విచారణ చేపట్టారు. దీంతో విద్యార్థులను బయటకు పంపలేదు. అయితే దీనిపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వచ్చిన తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవాలి తప్పా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022