Hyderabad: తెలంగాణలో ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో మొత్తం 5 లక్షల 8 వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నేటి నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. లేదంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల నుంచి కూడా హాల్ టికెట్లను తీసుకోవచ్చని అన్నారు.
పరీక్షలు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు పూర్తవుతాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించబోమని ఇప్పటికే కఠిన నిబంధనలను అధికారులు పెట్టారు.
Hyderabad: తెలంగాణలో ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో మొత్తం 5 లక్షల 8 వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నేటి నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. లేదంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల నుంచి కూడా హాల్ టికెట్లను తీసుకోవచ్చని అన్నారు.
పరీక్షలు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు పూర్తవుతాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించబోమని ఇప్పటికే కఠిన నిబంధనలను అధికారులు పెట్టారు.
Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022