Srisailam: శ్రీశైలం దేవస్థాన శీఘ్ర దర్శనం టిక్కెట్ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని విమలపై ఆలయ ఈవో లవన్న సస్పెన్షన్ వేటు వేశారు. ఈనెల 5వ తేదీన సాయంత్రం స్వామివారి ఆలయంలో అతిశీఘ్ర దర్శన క్యూలైన్ వద్ద తనిఖీలు చేయగా ఒక్క టిక్కెట్టు పై ఐదుగురు భక్తులను అనుమతించినట్లు భయటపడింది.
విమల భక్తుల వద్ద 5 టికెట్లకు డబ్బులు వసూలు చేసి ఒక్క టికెట్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దర్శనానికి వెళ్లిన భక్తులను విచారించగా కౌంటర్లోని ఉద్యోగికి రూ.1500 చెల్లించామని చెప్పడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో లవన్న ఉత్తర్వులు జారీ చేశారు.
34 రోజుల్లో 4 కోట్ల ఆదాయం..
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. 34 రోజుల్లో శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 23 వేల 145 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. హుండీ లెక్కింపులో నగదుతో పాటు 391 గ్రాముల బంగారం, 9 కేజీల 4 వందల గ్రాముల వెండి, 3 వేల 278 యూఎస్ డాలర్లతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీని భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించినట్లు ఈవో తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరిగినట్లు చెప్పారు. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
Srisailam: శ్రీశైలం దేవస్థాన శీఘ్ర దర్శనం టిక్కెట్ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని విమలపై ఆలయ ఈవో లవన్న సస్పెన్షన్ వేటు వేశారు. ఈనెల 5వ తేదీన సాయంత్రం స్వామివారి ఆలయంలో అతిశీఘ్ర దర్శన క్యూలైన్ వద్ద తనిఖీలు చేయగా ఒక్క టిక్కెట్టు పై ఐదుగురు భక్తులను అనుమతించినట్లు భయటపడింది.
విమల భక్తుల వద్ద 5 టికెట్లకు డబ్బులు వసూలు చేసి ఒక్క టికెట్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దర్శనానికి వెళ్లిన భక్తులను విచారించగా కౌంటర్లోని ఉద్యోగికి రూ.1500 చెల్లించామని చెప్పడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో లవన్న ఉత్తర్వులు జారీ చేశారు.
34 రోజుల్లో 4 కోట్ల ఆదాయం..
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. 34 రోజుల్లో శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 23 వేల 145 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. హుండీ లెక్కింపులో నగదుతో పాటు 391 గ్రాముల బంగారం, 9 కేజీల 4 వందల గ్రాముల వెండి, 3 వేల 278 యూఎస్ డాలర్లతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీని భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించినట్లు ఈవో తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరిగినట్లు చెప్పారు. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022