తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిగా పేరు ప్రఖ్యాతలు సాధించిన ప్రముఖ నటి శరణ్యకు పితృ వియోగం కలిగింది. ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ దర్శకుడు ఆంటోనీ భాస్కర్ రాజ్(95 ) తాజాగా గుండె పోటు తో మృతి చెందారు.ఆయన గత కొంతకాలంగా చెన్నైలోని విరుగంబక్కమ్లో తన కూతురు శరణ్య ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి గుండె పోటు రావడంతో ఆయన మృతి చెందారు. దీనితో, ఆమె ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అంత్యక్రియలు జరగనున్నాయి. దర్శకుడు ఆంటోని మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 70కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలుత శ్రీలంకలో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన ఆంటోని తరువాత మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ వచ్చారు. మలయాళం లో పలు హిట్ సినిమాలను తీసిన ఆయన, ఆ తరువాత తమిళంలో కూడా దర్శకత్వం వహించారు
తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిగా పేరు ప్రఖ్యాతలు సాధించిన ప్రముఖ నటి శరణ్యకు పితృ వియోగం కలిగింది. ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ దర్శకుడు ఆంటోనీ భాస్కర్ రాజ్(95 ) తాజాగా గుండె పోటు తో మృతి చెందారు.ఆయన గత కొంతకాలంగా చెన్నైలోని విరుగంబక్కమ్లో తన కూతురు శరణ్య ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి గుండె పోటు రావడంతో ఆయన మృతి చెందారు. దీనితో, ఆమె ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అంత్యక్రియలు జరగనున్నాయి. దర్శకుడు ఆంటోని మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 70కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలుత శ్రీలంకలో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన ఆంటోని తరువాత మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ వచ్చారు. మలయాళం లో పలు హిట్ సినిమాలను తీసిన ఆయన, ఆ తరువాత తమిళంలో కూడా దర్శకత్వం వహించారు
Read latest బ్రేకింగ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox