Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు న్యాయవాది ద్వారా బండి సంజయ్ కు కేటీఆర్ నోటీసు పంపారు.
కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్ధులు మరణించారని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్ధులు చనిపోతే కేసీఆర్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియోను బండి సంజయ్ పోస్టు చేసారు.
అయితే ఇంటర్ విద్యార్ధుల మృతికి తాను ఎలా కారణమయ్యానో బండి సంజయ్ ఆధారాలు చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల పై చట్ట పరమైన చర్యలు తీసుకొంటానని కూడా ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ బండి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలుంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని లేకపోతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా కేటీఆర్ కోరారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.
Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు న్యాయవాది ద్వారా బండి సంజయ్ కు కేటీఆర్ నోటీసు పంపారు.
కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్ధులు మరణించారని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్ధులు చనిపోతే కేసీఆర్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియోను బండి సంజయ్ పోస్టు చేసారు.
అయితే ఇంటర్ విద్యార్ధుల మృతికి తాను ఎలా కారణమయ్యానో బండి సంజయ్ ఆధారాలు చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల పై చట్ట పరమైన చర్యలు తీసుకొంటానని కూడా ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ బండి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలుంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని లేకపోతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా కేటీఆర్ కోరారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.
Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022