ఎక్కువ సంఖ్యలో బిలియనీర్లున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని నిలుపుకుంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, ప్రపంచంలో మొత్తం 209 మంది భారతీయ బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 32 మంది విదేశాల్లో నివసిస్తున్నారు. అంటే దేశంలో నివసిస్తున్న బిలియనీర్ల సంఖ్య 177గా వుంది. భారతదేశంలో కనీసం 61 మంది బిలియనీర్లు ముంబైలో నివసిస్తుండగా, ఢిల్లీలో 40 మంది, బెంగళూరులో 22 మంది ఉన్నారని నివేదిక పేర్కొంది.
83 బిలియన్ డాలర్ల నికర విలువతో రిలయన్స్ ఇండియా చైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశ సంపన్న వ్యక్తిగా నిలిచారు. అతను ఆసియాలో రెండవ ధనవంతుడు మరియు మంగళవారం విడుదల చేసిన గ్లోబల్ రిచ్ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. గౌతమ్ అదానీ మరియు అతని కుటుంబ సంపద ఈ సంవత్సరం దాదాపు 32 బిలియన్ డాలర్లకు పెరిగింది, అదానీ గ్రీన్ ఎనర్జీ 20 బిలియన్ డాలర్ల విలువకు పెరిగింది. హురున్ డేటా ప్రకారం అదానీ రెండవ ధనవంతుడు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ శివ్ నాదర్ సంపద 10 బిలియన్ డాలర్ల మేర 27 బిలియన్ డాలర్లకు పెరిగింది.అతను ప్రస్తుతం మూడవ సంపన్న భారతీయుడు. ఎన్ఆర్ నారాయణ మూర్తి సంపద 3.1 బిలియన్ డాలర్లకు చేరుకుందని నివేదిక తెలిపింది.
ఇన్స్టాకార్ట్కు చెందిన అపూర్వా మెహతా, జెరోదాకు చెందిన నిఖిల్ కామత్ 1.5 బిలియన్ డాలర్ల నికర విలువతో జాబితాలో అతి పిన్న వయస్కులైన బిలియనీర్గా నిలిచారు. ల్యాండ్మార్క్కు చెందిన ముఖేష్ జగ్టియాని హురున్ రిచ్ లిస్ట్ 2021 లో భారతదేశం నుండి కొత్తగా చేరారు. అయితే ఓయో రూమ్స్ సీఈఓ, రితేష్ అగర్వాల్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీ, ఎన్ఎంసి హెల్త్ వ్యవస్థాపకుడు బిఆర్ శెట్టి హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021లో తమ బిలియనీర్ హోదాను కోల్పోయారు. మరిన్ని వార్తలు చదవండి
ఎక్కువ సంఖ్యలో బిలియనీర్లున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని నిలుపుకుంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, ప్రపంచంలో మొత్తం 209 మంది భారతీయ బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 32 మంది విదేశాల్లో నివసిస్తున్నారు. అంటే దేశంలో నివసిస్తున్న బిలియనీర్ల సంఖ్య 177గా వుంది. భారతదేశంలో కనీసం 61 మంది బిలియనీర్లు ముంబైలో నివసిస్తుండగా, ఢిల్లీలో 40 మంది, బెంగళూరులో 22 మంది ఉన్నారని నివేదిక పేర్కొంది.
83 బిలియన్ డాలర్ల నికర విలువతో రిలయన్స్ ఇండియా చైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశ సంపన్న వ్యక్తిగా నిలిచారు. అతను ఆసియాలో రెండవ ధనవంతుడు మరియు మంగళవారం విడుదల చేసిన గ్లోబల్ రిచ్ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. గౌతమ్ అదానీ మరియు అతని కుటుంబ సంపద ఈ సంవత్సరం దాదాపు 32 బిలియన్ డాలర్లకు పెరిగింది, అదానీ గ్రీన్ ఎనర్జీ 20 బిలియన్ డాలర్ల విలువకు పెరిగింది. హురున్ డేటా ప్రకారం అదానీ రెండవ ధనవంతుడు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ శివ్ నాదర్ సంపద 10 బిలియన్ డాలర్ల మేర 27 బిలియన్ డాలర్లకు పెరిగింది.అతను ప్రస్తుతం మూడవ సంపన్న భారతీయుడు. ఎన్ఆర్ నారాయణ మూర్తి సంపద 3.1 బిలియన్ డాలర్లకు చేరుకుందని నివేదిక తెలిపింది.
ఇన్స్టాకార్ట్కు చెందిన అపూర్వా మెహతా, జెరోదాకు చెందిన నిఖిల్ కామత్ 1.5 బిలియన్ డాలర్ల నికర విలువతో జాబితాలో అతి పిన్న వయస్కులైన బిలియనీర్గా నిలిచారు. ల్యాండ్మార్క్కు చెందిన ముఖేష్ జగ్టియాని హురున్ రిచ్ లిస్ట్ 2021 లో భారతదేశం నుండి కొత్తగా చేరారు. అయితే ఓయో రూమ్స్ సీఈఓ, రితేష్ అగర్వాల్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీ, ఎన్ఎంసి హెల్త్ వ్యవస్థాపకుడు బిఆర్ శెట్టి హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021లో తమ బిలియనీర్ హోదాను కోల్పోయారు. మరిన్ని వార్తలు చదవండి
Read latest బ్రేకింగ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
14 Apr 2021
11 Apr 2021
16 Apr 2021
16 Apr 2021
16 Apr 2021