ఆంధ్రప్రదేశ్ : ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు ఇవ్వాలని మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఏసీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ప్లాస్మా థెరపీపై కూడా బాగా అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్ డెస్క్లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశించారు. అలాగే సంబంధిత ఆస్పత్రిలో బ్లాక్ బోర్డు పెట్టి, అక్కడి బెడ్ల ఖాళీ, భర్తీ వివరాలను అందులో రాయాలని ఆదేశించారు. ఎవరికైనా బెడ్ అందుబాటులో లేకపోతే వారిని సమీప ఆస్పత్రికి పంపించి అక్కడ బెడ్ అలాట్ చేయాలని తెలిపారు.
బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదు. హెల్ప్డెస్క్ల్లో ఆరోగ్య మిత్రలను ఉంచాలి. కోవిడ్ కోసం నిర్దేశించిన138ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టండి. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. హెల్ప్డెస్క్లో ఉన్నవారికి ఓరియంటేషన్ బాగుండాలి. హెల్ప్డెస్క్ ప్రభావవంతంగా పనిచేస్తే చాలావరకు సమస్యలు తగ్గుతాయి. బెడ్లు, వైద్యం, ఫుడ్, శానిటేషన్ బాగుందా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.
జీజీహెచ్ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాలి. సమర్థవంతమైన సిబ్బందిని పెట్టాలి. జేసీలు దీనిపై ఫోకస్ పెట్టాలి. ఆస్పత్రుల మేనేజ్మెంట్పై బాగా దృష్టి పెట్టండి. కాల్సెంటర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా, లేదా చూడండి. వచ్చే కొన్ని రోజులు దీనిపై శ్రద్ధ వహించండి. కోవిడ్పై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేపట్టండి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి.
కోవిడ్ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే, ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలి. నాడు-నేడు కార్యక్రమాలనూ సమీక్షించాలి. మూడేళ్లలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తికావాలి అని సీఎం జగన్ ఆదేశించారు. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు ఇవ్వాలని మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఏసీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ప్లాస్మా థెరపీపై కూడా బాగా అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్ డెస్క్లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశించారు. అలాగే సంబంధిత ఆస్పత్రిలో బ్లాక్ బోర్డు పెట్టి, అక్కడి బెడ్ల ఖాళీ, భర్తీ వివరాలను అందులో రాయాలని ఆదేశించారు. ఎవరికైనా బెడ్ అందుబాటులో లేకపోతే వారిని సమీప ఆస్పత్రికి పంపించి అక్కడ బెడ్ అలాట్ చేయాలని తెలిపారు.
బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదు. హెల్ప్డెస్క్ల్లో ఆరోగ్య మిత్రలను ఉంచాలి. కోవిడ్ కోసం నిర్దేశించిన138ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టండి. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. హెల్ప్డెస్క్లో ఉన్నవారికి ఓరియంటేషన్ బాగుండాలి. హెల్ప్డెస్క్ ప్రభావవంతంగా పనిచేస్తే చాలావరకు సమస్యలు తగ్గుతాయి. బెడ్లు, వైద్యం, ఫుడ్, శానిటేషన్ బాగుందా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.
జీజీహెచ్ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాలి. సమర్థవంతమైన సిబ్బందిని పెట్టాలి. జేసీలు దీనిపై ఫోకస్ పెట్టాలి. ఆస్పత్రుల మేనేజ్మెంట్పై బాగా దృష్టి పెట్టండి. కాల్సెంటర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా, లేదా చూడండి. వచ్చే కొన్ని రోజులు దీనిపై శ్రద్ధ వహించండి. కోవిడ్పై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేపట్టండి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి.
కోవిడ్ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే, ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలి. నాడు-నేడు కార్యక్రమాలనూ సమీక్షించాలి. మూడేళ్లలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తికావాలి అని సీఎం జగన్ ఆదేశించారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021