ఆంధ్రప్రదేశ్ :వైసీపీ ఎంపీ మరణించడంతో, తిరుపతిలో బైపోల్స్ రానున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందరికంటే ముందుగానే పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరుని ప్రకటించేశారు. అయితే, ఆ అభ్యర్థి మాత్రం ఇంతవరకు ప్రత్యక్షంగా తిరుపతి బైపోల్స్ గురించి ప్రస్తావించలేదు. దీనితో, సొంత పార్టీ నేతలతో సహా పలువురికి పలు అనుమానాలు వస్తున్నాయి. ఆమె పార్టీ అభ్యర్థి గా బరిలోకి దిగి పోటీ చేస్తారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
మరో వైపు టీడీపీ తిరుపతి ఎన్నికల్లో గెలుపొందుతుందా అన్న సందేహాలు కూడా సొంత పార్టీ నేతల్లోనే ఉన్నాయి. వైసీపీ పార్టీని దీటు గా ఎదుర్కొనేలా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అభ్యర్థి పేరుని ప్రకటించిన సరే ఆమె స్పందించకపోవడం పై కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మరో వైపు, తన సొంత పార్టీలో అభ్యర్థి ని ప్రకటించేసి, బీజేపీ అభ్యర్థికి కూడా సహకారం అందిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో టీడీపీ పోటీ చేసినా, గెలిచే అవకాశాలు తక్కువే. అందుకే పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి తిరుపతి బైపోల్స్ విషయమై స్పందించడం లేదనే వార్తలు వస్తున్నాయన్నారు. మరో వైపు పనబాక లక్ష్మితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే అధినేత చంద్రబాబు నాయుడు ఆమె పేరుని ప్రకటించేశారన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.
ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి సహకారం ఇస్తూ బీజేపీ మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నోటిఫికేషన్ వచ్చే సమయానికి టీడీపీ అభ్యర్థిగా ఉన్న పనబాక లక్ష్మి గారు పోటీ చేయడానికి నిరాకరిస్తే మరో అభ్యర్థి పేరుని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా అభ్యర్థిని ప్రకటించే ముందు కొంత చర్చించుకుని ఉండి ఉంటె బాగుండేది. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
ఆంధ్రప్రదేశ్ :వైసీపీ ఎంపీ మరణించడంతో, తిరుపతిలో బైపోల్స్ రానున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందరికంటే ముందుగానే పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరుని ప్రకటించేశారు. అయితే, ఆ అభ్యర్థి మాత్రం ఇంతవరకు ప్రత్యక్షంగా తిరుపతి బైపోల్స్ గురించి ప్రస్తావించలేదు. దీనితో, సొంత పార్టీ నేతలతో సహా పలువురికి పలు అనుమానాలు వస్తున్నాయి. ఆమె పార్టీ అభ్యర్థి గా బరిలోకి దిగి పోటీ చేస్తారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
మరో వైపు టీడీపీ తిరుపతి ఎన్నికల్లో గెలుపొందుతుందా అన్న సందేహాలు కూడా సొంత పార్టీ నేతల్లోనే ఉన్నాయి. వైసీపీ పార్టీని దీటు గా ఎదుర్కొనేలా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అభ్యర్థి పేరుని ప్రకటించిన సరే ఆమె స్పందించకపోవడం పై కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మరో వైపు, తన సొంత పార్టీలో అభ్యర్థి ని ప్రకటించేసి, బీజేపీ అభ్యర్థికి కూడా సహకారం అందిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో టీడీపీ పోటీ చేసినా, గెలిచే అవకాశాలు తక్కువే. అందుకే పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి తిరుపతి బైపోల్స్ విషయమై స్పందించడం లేదనే వార్తలు వస్తున్నాయన్నారు. మరో వైపు పనబాక లక్ష్మితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే అధినేత చంద్రబాబు నాయుడు ఆమె పేరుని ప్రకటించేశారన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.
ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి సహకారం ఇస్తూ బీజేపీ మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నోటిఫికేషన్ వచ్చే సమయానికి టీడీపీ అభ్యర్థిగా ఉన్న పనబాక లక్ష్మి గారు పోటీ చేయడానికి నిరాకరిస్తే మరో అభ్యర్థి పేరుని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా అభ్యర్థిని ప్రకటించే ముందు కొంత చర్చించుకుని ఉండి ఉంటె బాగుండేది. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
17 Jan 2021
16 Jan 2021
17 Jan 2021
17 Jan 2021