ఆంధ్రప్రదేశ్ : శ్రావణ మాసం తీసుకొచ్చే శోభా అంతా ఇంతా కాదు. తెలుగింటి ఆడపడుచులకు పండగ కాలం ఇది.కొత్త పెళ్లికూతుర్ల సిగ్గులు,ఆషాఢమాసం ఇంటికొచ్చి పూజలు చేసుకుంటూ,వెలుగులు నింపే మహాలక్ష్ములు శ్రావణానికి రంగుల చీరని కడతారు. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా అంత శోభా కనపడటం లేదు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవడం,పెళ్ళిళ్ళకి కూడా అనుమతులు దొరక్కపోవడం,వచ్చినా ఎక్కువ మందికి అనుమతి ఇవ్వకపోవడంతో కళకళలాడాల్సిన పెళ్లి పందిర్లు కూడా సాధారణం గా అయిపోయాయి.
ఇక వరలక్ష్మి వ్రతాలు సామూహికం గా జరిపించడం వంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ కానరావడం లేదు. అయితే ప్రసిద్ధ దేవాలయాల్లో అమ్మవారికి పూజలు శాస్త్రోక్తం తక్కువ పరిమితి తో పూజలు జరిపించారు. చిత్తూరు జిల్లా తిరుచానూరులో పద్మావతి అమ్మవారికి కూడా వరలక్ష్మి పూజ ను వైభవోపేతం గా జరిపించారు. ఇందులో భాగంగా ఉదయం అయిదు గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్య అర్చన పూజలు చేశారు. అనంతరం మూలమూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. అలంకార శోభితురాలైన అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని ముఖమండపంలో కొలువుదీర్చారు. ఉదయం10 నుంచి 12 గంటల వరకు శాస్రోక్తంగా వరలక్ష్మీ పూజలు జరిపారు.
ఎక్కువ మందిని అనుమతించే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ లోనే వ్రతం టికెట్లు కొనుగోలు చేసుకునే ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా వ్రతం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు అమ్మవారి ప్రసాదాలను పోస్టల్ ద్వారా వారి చిరునామాకు పంపనున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ చరిత్రలో భక్తులు ఎవరు లేకుండా ఇలా పూజలు జరిపించడం ఇదే మొట్ట మొదటి సారి. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : శ్రావణ మాసం తీసుకొచ్చే శోభా అంతా ఇంతా కాదు. తెలుగింటి ఆడపడుచులకు పండగ కాలం ఇది.కొత్త పెళ్లికూతుర్ల సిగ్గులు,ఆషాఢమాసం ఇంటికొచ్చి పూజలు చేసుకుంటూ,వెలుగులు నింపే మహాలక్ష్ములు శ్రావణానికి రంగుల చీరని కడతారు. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా అంత శోభా కనపడటం లేదు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవడం,పెళ్ళిళ్ళకి కూడా అనుమతులు దొరక్కపోవడం,వచ్చినా ఎక్కువ మందికి అనుమతి ఇవ్వకపోవడంతో కళకళలాడాల్సిన పెళ్లి పందిర్లు కూడా సాధారణం గా అయిపోయాయి.
ఇక వరలక్ష్మి వ్రతాలు సామూహికం గా జరిపించడం వంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ కానరావడం లేదు. అయితే ప్రసిద్ధ దేవాలయాల్లో అమ్మవారికి పూజలు శాస్త్రోక్తం తక్కువ పరిమితి తో పూజలు జరిపించారు. చిత్తూరు జిల్లా తిరుచానూరులో పద్మావతి అమ్మవారికి కూడా వరలక్ష్మి పూజ ను వైభవోపేతం గా జరిపించారు. ఇందులో భాగంగా ఉదయం అయిదు గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్య అర్చన పూజలు చేశారు. అనంతరం మూలమూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. అలంకార శోభితురాలైన అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని ముఖమండపంలో కొలువుదీర్చారు. ఉదయం10 నుంచి 12 గంటల వరకు శాస్రోక్తంగా వరలక్ష్మీ పూజలు జరిపారు.
ఎక్కువ మందిని అనుమతించే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ లోనే వ్రతం టికెట్లు కొనుగోలు చేసుకునే ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా వ్రతం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు అమ్మవారి ప్రసాదాలను పోస్టల్ ద్వారా వారి చిరునామాకు పంపనున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ చరిత్రలో భక్తులు ఎవరు లేకుండా ఇలా పూజలు జరిపించడం ఇదే మొట్ట మొదటి సారి. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 May 2022
26 May 2022
26 May 2022
26 May 2022