విజయవాడ దుర్గగుడిలో మూడు సింహాల వెండి విగ్రహల అపహరణ కేసు పోలీసులు ఛేదించారుఈ కేసులో ప్రదాన నిందితుడు జక్కంపూడి సాయితో పాటు బంగారం వ్యాపారి కమలేష్ ని అరెస్టు చేసారు. దీనికి సంబంధించిన విశేషాలను విజయవాడ కమీషనర్ బి. శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. గత సంవత్సరం సెప్టంబర్ 17వ,తేదిన దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వెండిరధంలోని 4వెండి సింహాలులో 3 సింహాలు మాయమైనట్లు పిర్యాదు అందింది. కాని జులైలో దొంగతనం జరిగినట్లు విచారణలో తెలింది. ఎటువంటి ఆదారాలు లేని సందర్భంలో టెక్నాలజీని ఉపయోగించి 150మంది వరకు విచారించినట్లు కమీషనర్ తెలిపారు
కేసులో ప్రధాన నిందితుడు భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన జక్కంసెట్టి సాయిగా నిర్ధారించామని ఆయన అన్నారు. లాక్ డౌన్ సమయానికి ముందు అమ్మవారి దర్శనంకు వచ్చి సరిగా సెక్యూరిటీ లేకపోవటంతో 4 సింహాలు దొంగిలించాలని చూసినా 3 వెండి సింహాలు దొంగిలించాడని వీటి బరువు 9కేజిల వరకు వుంటుందన్నారు. గతంలో భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు పట్టణాలలోని ఆలయాల్లో దొంగతనాలు చేసిన రికార్డు నిందితుడు సాయికి ఉంది. 2012లో బాలకృష్ణ అలియాస్ సాయి అరెస్ట్ చేసి భీమవరం పోలీసులు జైలుకు పంపారు
బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఆలయాల్లో చోరీలు మొదలుపెట్టాడు. సాయితోపాటు బంగారం వ్యాపారి ముత్తాకమలేష్ ను కూడా అరెస్టు చేశారు. చోరికి గురైన మొత్తం వెండితో పాటు మిగతా ఆలయాల్లో దొంగతనాలకు సంబంధించిన 6.4 కేజిల వెండిని రికవరి చేసినట్లు కమీషనర్ శ్రీనివాసులు వివరించారు. మరిన్ని వార్తలు చదవండి
విజయవాడ దుర్గగుడిలో మూడు సింహాల వెండి విగ్రహల అపహరణ కేసు పోలీసులు ఛేదించారుఈ కేసులో ప్రదాన నిందితుడు జక్కంపూడి సాయితో పాటు బంగారం వ్యాపారి కమలేష్ ని అరెస్టు చేసారు. దీనికి సంబంధించిన విశేషాలను విజయవాడ కమీషనర్ బి. శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. గత సంవత్సరం సెప్టంబర్ 17వ,తేదిన దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వెండిరధంలోని 4వెండి సింహాలులో 3 సింహాలు మాయమైనట్లు పిర్యాదు అందింది. కాని జులైలో దొంగతనం జరిగినట్లు విచారణలో తెలింది. ఎటువంటి ఆదారాలు లేని సందర్భంలో టెక్నాలజీని ఉపయోగించి 150మంది వరకు విచారించినట్లు కమీషనర్ తెలిపారు
కేసులో ప్రధాన నిందితుడు భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన జక్కంసెట్టి సాయిగా నిర్ధారించామని ఆయన అన్నారు. లాక్ డౌన్ సమయానికి ముందు అమ్మవారి దర్శనంకు వచ్చి సరిగా సెక్యూరిటీ లేకపోవటంతో 4 సింహాలు దొంగిలించాలని చూసినా 3 వెండి సింహాలు దొంగిలించాడని వీటి బరువు 9కేజిల వరకు వుంటుందన్నారు. గతంలో భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు పట్టణాలలోని ఆలయాల్లో దొంగతనాలు చేసిన రికార్డు నిందితుడు సాయికి ఉంది. 2012లో బాలకృష్ణ అలియాస్ సాయి అరెస్ట్ చేసి భీమవరం పోలీసులు జైలుకు పంపారు
బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఆలయాల్లో చోరీలు మొదలుపెట్టాడు. సాయితోపాటు బంగారం వ్యాపారి ముత్తాకమలేష్ ను కూడా అరెస్టు చేశారు. చోరికి గురైన మొత్తం వెండితో పాటు మిగతా ఆలయాల్లో దొంగతనాలకు సంబంధించిన 6.4 కేజిల వెండిని రికవరి చేసినట్లు కమీషనర్ శ్రీనివాసులు వివరించారు. మరిన్ని వార్తలు చదవండి
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
06 Mar 2021
05 Mar 2021
07 Mar 2021